Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైల్వేలను ప్రైవేటీకరించే ప్రసక్తే లేదు : కేంద్రం

Webdunia
గురువారం, 17 మార్చి 2022 (14:42 IST)
రైల్వేను ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని కేంద్రం స్పష్టం చేసింది. రైల్వేను ప్రైవేటీకరణ చేయబోతున్నారంటూ విపక్ష సభ్యులు గురువారం పార్లమెంట్‌లో ఆందోళన చేశారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. రైల్వేను ప్రైవేటీకరించనున్నట్టు సాగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని, రైల్వేను ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని కేంద్రం స్పష్టం చేసింది. 
 
బడ్జెట్‌లో రైల్వే శాఖ కేటాయింపులపై గురువారం చర్చ జరిగింది. దీనిపై అనేక మంది విపక్ష సభ్యులు మాట్లాడారు. రైల్వేల ప్రైవేటీకరణకు కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేస్తుందని ఆరోపిస్తూ సభలో ఆందోళన వ్యక్తం చేశారు. 
 
దీంతో రైల్వేశాఖామంత్రి అశ్విన్ వైష్ణవ్ వివరణ ఇచ్చారు. రైల్వేలను ప్రైవేటీకరణ చేసే ఆలోచనే లేదని స్పష్టం చేశారు. రైల్వే వ్యవస్థలో రైళ్ళు, ట్రాక్‌లు, రైల్వేస్టేషన్లు, ఇంజిన్లు, బోగీలు అన్ని ప్రభుత్వ ఆస్తులేనని వివరించారు. రైల్వేను కేంద్రం ప్రైటీకరిస్తుందన్న ఆరోపణలు విపక్ష సభ్యుల ఊహాజనితమేనని అశ్విన్ వైష్ణవ్ స్పష్టం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments