Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉన్నపళంగా ఖాళీ చేయిస్తున్న ఖతార్.. విదేశీ కార్మికులు షాక్

Webdunia
సోమవారం, 31 అక్టోబరు 2022 (10:41 IST)
ప్రతిష్టాత్మక ఫిఫా ఫుట్‌బాల్ ప్రపంచ కప్ పోటీలకు ఖతార్ దేశం ఆతిథ్యమివ్వనుంది. ఇందుకోసం భారీస్థాయిలో ఏర్పాట్లుచేస్తుంది. ఆ దేశ రాజధాని దోహాలో ఈ క్రీడా పోటీలు జరుగనున్నాయి. అయితే, ఈ దేశంలో ఉన్న విదేశీ కార్మికుల మెడపై కత్తిపెట్టి, నోటీసులిచ్చిన రెండు గంటల్లో తమ నివాసాలను ఖాళీ చేయాలని ఆదేశించింది. 
 
అలా ఖాళీ చేయని వారిని సామాన్లను రోడ్డుపై పడేశారు. రాత్రి వేళ అని కూడా చూడకుండా సామాన్లు సర్దుకునే సమయం కూడా ఇవ్వకుండా కేవలం 2 గంటల ముందు నోటీసిలిచ్చి వెళ్లిపోవాలని వేధిస్తున్నారంటూ విదేశీ కార్మికులు వాపోతున్నారు. 
 
కాగా, నవంబరు 20వ తేదీ నుంచి దోహా వేదికగా ఫుట్‌బాల్ సమరం ప్రారంభంకానుంది. మ్యాచ్‌లను చూసేందుకు ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే లక్షల మంది అభిమానులకు సరిపడ నివాసాలు లేకపోవడంతో ఖతార్ ప్రభుత్వం ఈ తరహా కఠిన చర్యలు చేపడుతోంది. 
 
ఇలా ఖాళీ చేయాల్సిన కార్మికుల్లో ఆసియా, ఆఫ్రికా దేశాలకు చెందినవారే ఉండటం గమనార్హం. కాగా, ఖతార్ జనాభా 30 లక్షలు కాగా, 85 శాతం మంది విదేశీ కార్మికులో ఉన్నరు. వీరిలో ఎక్కువగా డ్రైవర్లు, దినసరి కార్మికులు, ఇతర పనులు చేసేవారే ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudheer: కృష్ణ కు నివాళితో జటాధర చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప్రారంభించిన సుధీర్ బాబు

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments