Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా సంతానం రాచబిడ్డల్లా పెరగకూడదు.. అందుకే ఈ నిర్ణయం : ప్రిన్స్ హ్యారీ

Webdunia
శుక్రవారం, 14 మే 2021 (12:43 IST)
బ్రిటన్ యువరాజు హ్యారీ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన సంతానం రాచబిడ్డలా పెరగకూడదన్నారు. అందుకే, కుటుంబానికి దూరంగా వచ్చేసినట్టు చెప్పారు. ముఖ్యంగా, తనను పెంచేందుకు తన తండ్రి ఎన్నో కష్టాలు పడ్డారన్నారు. ఆ కష్టాలు తనతో పాటు.. తన బిడ్డలు పడకూడదనే బాధలు, బంధనాల నుంచి విముక్తి పొందేందుకే కుటుంబం అనే సంకెళ్లు తెంచుకుని అమెరికాకు వెళ్లామన్నారు. తన తండ్రి ప్రిన్స్ చార్లెస్ పడిన బాధలే తానూ పడ్డానని చెప్పుకొచ్చారు. 
 
గురువారం ‘ఆర్మ్ చెయిర్ ఎక్స్‌పర్ట్’ పాడ్ క్యాస్ట్ ఇంటర్వ్యూలో ఆయన తన వ్యక్తిగత జీవితంలోని పలు విషయాలను పంచుకున్నారు. తాను తీసుకున్న నిర్ణయం విషయంలో తన తండ్రిని నిందించదలచుకోలేదని హ్యారీ చెప్పారు. అయితే, తన పిల్లల విషయంలో మాత్రం తన తండ్రి చేసిన తప్పే చేయకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నానని వివరించారు. 
 
తన పిల్లల పెంపకం విషయంలో తాను చాలా ఆవేదనకు గురయ్యానన్నారు. రాజకుటుంబంలో ఇలాంటి బాధలే తన తల్లిదండ్రులూ పడి ఉండొచ్చన్నారు. కాబట్టి ఆ బాధల బంధనాలను తెంచుకోవాలన్న నిర్ణయానికి వచ్చానని తెలిపారు.
 
తమ పెంపకం విషయంలో తన తండ్రి ఎన్ని కష్టాలు పడ్డాడో, రాచబిడ్డల్లా తమను పెంచేందుకు ఎంత ఆవేదన అనుభవించారో ఇప్పుడు అర్థమవుతోందని చెప్పారు. ఇలాంటి పెంపకాన్ని తన పిల్లలకు ఇవ్వకూడదన్న ఉద్దేశంతోనే భార్యాపిల్లలతో అమెరికాకు వచ్చేశానని ఆయన వివరించారు. ప్రస్తుతం మేఘన్‌తో కలిసి ఆయన లాస్ఏంజిలిస్‌కు సమీపంలోని మోంటేసిటోలో ప్రిన్స్ హ్యారీ దంపతులు నివసిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ వైపు మళ్లిన హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ వర్సెస్ శ్రీలీల

మా నాన్న కూడా ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయలేదు : బడ్డీ మూవీ హీరో అల్లు శిరీష్

ఆది సాయికుమార్ విజువ‌ల్ వండ‌ర్ ష‌ణ్ముఖ షూటింగ్ పూర్తి

థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో 1000 వాలా టీజర్ వచ్చేసింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments