Webdunia - Bharat's app for daily news and videos

Install App

రిపబ్లిక్‌డే వేడుకలకు బ్రిటన్‌ ప్రధాని

Webdunia
బుధవారం, 16 డిశెంబరు 2020 (06:06 IST)
జనవరి 26న దేశరాజధాని ఢిల్లీలో జరగనున్న గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ హాజరు కానున్నారు. భారతదేశం నుండి వచ్చిన ఈ ఆహ్వానాన్ని జాన్సన్‌ గొప్ప గౌరవంగా భావించారని యుకె విదేశాంగశాఖ కార్యదర్శి డోమినిక్‌రాబ్‌ తెలిపారు.

భారత్‌ నాలుగు రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం ఢిల్లీకి చేరుకున్న రాబ్‌ను భారత విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ స్వాగతం పలికారు. అనంతరం రాబ్‌ మాట్లాడుతూ.. గతేడాది బోరిస్‌ జాన్సన్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇది ఆయన మొదటి దైపాక్షిక సందర్శనగా పేర్కొన్నారు.

కొత్త సంవత్సరంలో భారతదేశాన్ని సందర్శించడం పట్ల బోరిస్‌ జాన్సన్‌కు ఆనందంగా ఉందన్నారు. భారత ప్రధాని, తామూ కలిసి చేసిన ద్వైపాక్షిక ఒప్పందంలో భాగంగా క్వాంటమ్‌ లీప్‌ను ఇచ్చేందుకు ఎదురుచూస్తున్నారని తెలిపారు.

అలాగే వచ్చే ఏడాది బ్రిటన్‌లో జరగనున్న జి7 సమ్మిట్‌కు మోడీని బోరిస్‌ ఆహ్వానించినట్లు రాబ్‌ తెలిపారు. దీనిపట్ల భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ సంతోషం వ్యక్తం చేశారు. రిపబ్లిక్‌డే దినోత్సవ వేడుకలకు బోరిస్‌ రాకతో భారత్‌-యుకెల మధ్య సంబంధాలు కొత్త శకానికి నాంది పలికినట్లవుతుందని తెలిపారు.

కాగా.. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుండి రిపబ్లిక్‌డే పరేడ్‌కు వచ్చిన బ్రిటీషర్లలో బోరిస్‌ రెండోవారు. 1993లో జాన్‌ మేజర్‌ హాజరయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments