పాకిస్థాన్‌పై నిప్పులు చెరిగిన మోదీ.. కొన్ని దేశాలు ఇంటి దొంగ వంటివి..?

Webdunia
మంగళవారం, 17 నవంబరు 2020 (20:05 IST)
narendra modi
బ్రిక్స్ సదస్సు వేదికగా పాకిస్థాన్‌పైనా, అంతర్జాతీయ వ్యవస్థల తీరుపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గర్జించారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలితోపాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచ వాణిజ్య సంస్థ, అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థలను సంస్కరించాలని కోరారు.
 
ప్రస్తుత పరిస్థితుల్లో ఉగ్రవాదం ప్రపంచంలో అతిపెద్ద సమస్య అని పేర్కొన్నారు. ఉగ్రవాదానికి మద్దతిచ్చే, నిధులు సమకూర్చే అన్ని దేశాలను జవాబుదారీ చేయాలన్నారు. మోదీ వ్యాఖ్యలను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సమర్థించారు.
 
12వ బ్రిక్స్ సదస్సు రష్యా అధ్యక్షతన మంగళవారం జరిగింది. ఈ వర్చువల్ సమావేశంలో మోదీ మాట్లాడుతూ, మల్టీలేటరలిజం సంక్షోభంలో ఉందన్నారు. అంతర్జాతీయ సంస్థలపై ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయన్నారు. ఈ సంస్థలు 75 ఏళ్ల క్రితంనాటి ఆలోచనా ధోరణితో నడుస్తున్నాయని, కాలానుగుణంగా మారడం లేదని అన్నారు.
 
పాకిస్థాన్‌ను పరోక్షంగా ప్రస్తావిస్తూ, ప్రపంచం నేడు ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య ఉగ్రవాదమని తెలిపారు. ఉగ్రవాదులకు మద్దతిచ్చే, సహాయపడే దేశాలను కూడా అపరాధులుగా ప్రకటించాలన్నారు. బ్రిక్స్ కౌంటర్ టెర్రరిజం స్ట్రాటజీని ఖరారు చేయడం గొప్ప విజయమని తెలిపారు. 
 
ఉగ్రవాదంపై మోదీ వ్యాఖ్యలను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సమర్థించారు. కొన్ని దేశాలు ఇంటి దొంగ వంటివన్నారు. ఉగ్రవాదం, కోవిడ్-19 మహమ్మారి వంటి సమస్యల పట్ల ప్రపంచం అలసత్వంతో వ్యవహరించకూడదన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గురుదత్త గనిగ, రాజ్ బి. శెట్టి కాంబోలో జుగారి క్రాస్ టైటిల్ ప్రోమో

Shimbu: సామ్రాజ్యం తో శింబు బెస్ట్ గా తెరపైన ఎదగాలి : ఎన్టీఆర్

Ram Charan: పెద్ది తాజా అప్ డేట్.. శ్రీలంక వెళ్లనున్న రామ్‌చరణ్‌

Shivaji : శివాజీ, లయ కాంబినేషన్ లో పంచాయతీ సెక్రెటరీ

Siddu: తెలుసు కదా.. చేసే ముందు భయం ఉండేది, ఈరోజు భయం పోయింది : సిద్ధు జొన్నలగడ్డ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

తర్వాతి కథనం
Show comments