Webdunia - Bharat's app for daily news and videos

Install App

బుల్లెట్ దిగిందా లేదా అన్నది ముఖ్యం అన్నయ్యా... ముగ్గురుని లేపేశా.... పిలిప్పీన్ అధ్యక్షుడు

పోకిరి చిత్రంలో మహేశ్ బాబు ఓ డైలాగు చెపుతాడు. రౌడీని కాల్చేశాక, బుల్లెట్ దిగిందా లేదా అన్నది ముఖ్యం అన్నయ్యా అంటాడు. ఇలాంటి మాటనే పిలిప్పీన్స్ దేశాధ్యక్షుడు డుటెర్టి చెప్పేశాడు. తను మేయర్‌గా పనిచేస్తున్నప్పుడు ముగ్గురుని తుపాకీతో కాల్చి హత్య చేసినట్ల

Webdunia
శనివారం, 17 డిశెంబరు 2016 (16:16 IST)
పోకిరి చిత్రంలో మహేశ్ బాబు ఓ డైలాగు చెపుతాడు. రౌడీని కాల్చేశాక, బుల్లెట్ దిగిందా లేదా అన్నది ముఖ్యం అన్నయ్యా అంటాడు. ఇలాంటి మాటనే పిలిప్పీన్స్ దేశాధ్యక్షుడు డుటెర్టి చెప్పేశాడు. తను మేయర్‌గా పనిచేస్తున్నప్పుడు ముగ్గురుని తుపాకీతో కాల్చి హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. తను మేయర్‌గా ఉన్న సమయంలో నేరాలకు పాల్పడ్డ ముగ్గురిని తన తుపాకీతో కాల్చి చంపేసినట్లు ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. 
 
తను జరిపిన కాల్పుల్లో వారి శరీరాల్లోకి ఎన్ని బుల్లెట్లు దిగాయో తెలియదు కానీ తుపాకీ నుంచి బుల్లెట్ల వర్షం మాత్రం కురిపించానంటూ సంచలన ప్రకటన చేశారు డుటెర్టి. మరోవైపు ప్రస్తుతం అధ్యక్షుడుగా కొనసాగుతున్న ఆయన డ్రగ్ నేరస్తులను వరసబెట్టి చంపేస్తున్నారు. ఇప్పటివరకూ 6 వేల మందికి పైగా డ్రగ్ నేరగాళ్లు హతమయ్యారు. ఇంకా ఎక్కడైనా మిగిలుంటే వారిని కూడా ఏరివేస్తానని అంటున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: కమల్ హాసన్‌ను క్షమాపణ చెప్పమని కోరడం తగదు: సుప్రీం కోర్టు

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments