Webdunia - Bharat's app for daily news and videos

Install App

పార్టీ మీటింగ్‌లను జాతీయ గీతంతో ఎందుకు ప్రారంభించరు? : పవన్ కళ్యాణ్

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరో ప్రశ్న సంధించారు. అధికార భారతీయ జనతా పార్టీకి ఐదు ప్రశ్నలను సంధించనున్నట్టు ప్రకటించిన ఆయన.. ఇప్పటికే రెండు అంశాలపై స్పందించారు. తొలుత గోవధ, తర్వాత దళిత పరిశోధక వి

Webdunia
శనివారం, 17 డిశెంబరు 2016 (15:56 IST)
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరో ప్రశ్న సంధించారు. అధికార భారతీయ జనతా పార్టీకి ఐదు ప్రశ్నలను సంధించనున్నట్టు ప్రకటించిన ఆయన.. ఇప్పటికే రెండు అంశాలపై స్పందించారు. తొలుత గోవధ, తర్వాత దళిత పరిశోధక విద్యార్థి రోహిత్ వేముల అంశాలపై బీజేపీ ప్రశ్నలు సంధించారు. ఇపుడు జాతీయ గీతంపై ప్రశ్నించారు. అన్ని రాజకీయ పార్టీలు తమ పార్టీ మీటింగ్‌ల‌ను జాతీయ‌ గీతంతో ఎందుకు ప్రారంభించ‌బోవ‌ని, సినిమా థియేట‌ర్‌ల‌లో మాత్ర‌మే పాడాల‌ని ఎందుకు చెబుతున్నార‌ని ప‌వ‌న్ ప్ర‌శ్నించారు.
 
అంతేకాకుండా అధికార పార్టీ విధానాలను వ్యతిరేకించే వారిపై యాంటి నేషనల్స్ ముద్ర వేయరాదన్నారు. త‌మ‌కు వ్య‌తిరేకంగా గళం ఎత్తుతున్న వారిని మాటల‌ను అధికార పార్టీ మొద‌ట వినాల‌ని, ఆ త‌రువాతే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అన్నారు. కుల‌, మ‌త, వ‌ర్గ‌, ప్రాంత‌, భాషా విభేదాలు లేకుండా దేశంలోని పౌరుడు, రాజ‌కీయ పార్టీలు ముందుకు వెళ్ల‌డ‌మే దేశ‌భ‌క్తి అని ఆయ‌న ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు. దేశభ‌క్తి అనేది ఓ రాజ‌కీయ‌ పార్టీకి చెందిన అంశంగా ఉండ‌కూడ‌ద‌న్నారు. దేశభ‌క్తి అనేది మనిషిలో విలువ‌ల‌తో, మాన‌వతతో కూడి ఉండే అంశమ‌ని అన్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments