Webdunia - Bharat's app for daily news and videos

Install App

#టాంజానియా చర్చిలో తొక్కిసలాట-20 మంది మృతి.. ఫాదర్ అరెస్ట్

Webdunia
సోమవారం, 3 ఫిబ్రవరి 2020 (12:16 IST)
టాంజానియాలోని ఓ చర్చిలో జరిగిన తొక్కిసలాటలో 20మంది ప్రాణాలు కోల్పోయారు. తాను దేవుడి దూతనని, రోగాలను నయం చేసే నూనె తన దగ్గర వుందని మోషి టౌన్ లోని ఎవాంజెలికల్ క్రిస్టియన్ చర్చిలో ప్రముఖ మత బోధకుడు బోనిఫేస్ వాంపోసా తెలిపారు. ఈ నూనెను అక్కడికి వచ్చిన భక్తులపై చల్లడంతో ప్రేయర్‌లో ఉన్నట్టుండి ఒక్కసారిగా భక్తుల రద్దీ కారణంగా తొక్కిసలాట చోటుచేసుకుంది.
 
ఇలా భక్తులు ఆ నూనెను చల్లుతుంటే ఆ పవిత్రమైన నూనె తమపై పడాలని అంతా ఒక్కసారిగా దూసుకొచ్చారు. దీంతో తొక్కిసలాట జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఈ ఘటన జరిగిన వెంటనే మతబోధకుడు అక్కడి నుంచి పరారైనట్లు తెలిపారు. మోషిలో 20 మంది చనిపోయిన ఘటనపై టాంజానియా ప్రెసిడెంట్ మగుఫులి సంతాపం ప్రకటించారు. ఈ ఘటనకు బాధ్యుడైన మతబోధకుడికి పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు తెలిపారు. 
 
ఇంకా పోలీసులు మాట్లాడుతూ.. ఫాస్టర్లు చాలామంది దీర్ఘకాలిక వ్యాధులను నయం చేస్తామని, దారిద్ర్యాన్ని పారద్రోలు తామని ఆఫ్రికా దేశాల్లో కొన్నేళ్లుగా జనాలను మోసం చేస్తున్నారని చెప్పారు. ఇలా ఆర్థిక కుంభకోణాలు, మనీ లాండరింగ్ పథకాలు జరుగుతున్నాయని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

వరుణ్ తేజ్‌చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తున్న దక్ష నాగర్కర్ !

నేటి, రేపటి తరానికి కూడా ఆదర్శం పద్మభూషణ్ బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

తర్వాతి కథనం
Show comments