బండ్లగూడాలో దొంగల బీభత్సం... బంగారం-వెండి దోపిడి

Webdunia
సోమవారం, 3 ఫిబ్రవరి 2020 (12:06 IST)
రాజేంద్రనగర్ పోలిస్టేషన్ పరిధిలోని బండ్లగుడాలో దొంగల బీభత్సం సృష్టించారు. తాళం వేసిన ఇల్లును గుల్ల చేశారు దుండగులు. పది తులాల బంగారం, 30 తులాల వెండి అపహరించారు. 
 
ఖమ్మం ప్రాంతానికి చెందిన భాజా, సాధన అనే సాఫ్ట్వేర్ ఉద్యోగులు బండ్లగుడాలోని భారతి నగర్‌లో అద్దెకు ఉంటుంన్నారు. నిన్న సాయంత్రం భాజా సొంత పనిమీద ఖమ్మం వెళ్ళేందుకు భార్య సాధనాను పక్కనే ఉంటున్న అత్తవారింట్లో వదిలేసి ఇంటికి తాళం వేసి వెళ్ళాడు. 
 
ఉదయం ఇంటి యజమాని ఇంటి వైపు చూసేసరికి తాళాలు పగలగొట్టి ఉండటంతో సాధనకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న సాధన ఇంట్లోకి వెళ్ళి చూసే సరికి బీరువా తాళాలు పగలగొట్టి ఉన్నాయి.
 
బీరువాలోని పది తులాల బంగారం, 30 తులాల వెండి కనిపించలేదు. దీంతో స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ పొలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీమ్‌లను రంగంలోకి దింపి అధారాలను సేకరిస్తున్నారు.
 
కాలనీలో ఒక ఇంటిలో ఉన్న సీసీటీవీ ఫుటేజీలో రాత్రి టైంలో రికార్డ్ అయిన దృశ్యాల్లో కవర్ పట్టుకొని వెళ్తున్న వ్యక్తిని చూసి సాధన ఆ కవర్ వాళ్ల ఇంట్లోనిది అని గుర్తుంచింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత రెండో భర్త రాజ్ నిడుమోరు నేపథ్యం ఏంటి?

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య చిత్రం ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్

Varun Sandesh: వ‌రుణ్ సందేశ్ న‌య‌నం ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

MB50: రజనీ కాంత్ సహా ప్రముఖుల సమక్షంలో ఘనంగా మోహన్ బాబు 50 వేడుకలు

బాలీవుడ్‌లో మిల్కీ బ్యూటీకి బంపర్ ఆఫర్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments