Webdunia - Bharat's app for daily news and videos

Install App

అడవుల్లో మంటలు.. రోడ్లపై కార్లు.. 20 కి.మీ. పొడవునా కార్చిచ్చు.. మాడి మసైన ప్రయాణికులు

పచ్చని పైన్, యూకలిప్టస్‌ చెట్లతో సుందరంగా కనిపించిన వనాలు శ్మశానాలుగా దర్శనమిస్తే.. 20 కిలోమీటర్ల పొడవునా వ్యాపించిన కార్చిచ్చు బారినపడిన కార్లు ఉన్నచోటునే దగ్ధమయితే, డజన్లకొద్దీ మంటల్లో చిక్కుకుని మరణిస్తే.. ఇది పోర్చుగల బీభత్సం. మన దేశంలో కార్చిచ్

Webdunia
సోమవారం, 19 జూన్ 2017 (02:57 IST)
పచ్చని పైన్, యూకలిప్టస్‌ చెట్లతో సుందరంగా కనిపించిన వనాలు శ్మశానాలుగా దర్శనమిస్తే.. 20 కిలోమీటర్ల పొడవునా వ్యాపించిన కార్చిచ్చు బారినపడిన కార్లు ఉన్నచోటునే దగ్ధమయితే, డజన్లకొద్దీ మంటల్లో చిక్కుకుని మరణిస్తే.. ఇది పోర్చుగల బీభత్సం.  మన దేశంలో కార్చిచ్చు అడవులకే పరిమితం కాగా  యూరప్ దేశాల్లో రోడ్లను కూడా మంటలు వ్యాపించి మనుషులను, వాహనాలను నిలువునా తగలబెడుతున్నాయి. దీనికి తాజాగా బలయింది మాత్రం పోర్చుగల్. 
 
ఐరోపా దేశం పోర్చుగల్‌ అడవుల్లో వ్యాపించిన మంటలు 62 మందిని బలి తీసుకున్నాయి. అప్పటివరకు పచ్చని పైన్, యూకలిప్టస్‌ చెట్లతో సుందరంగా కనిపించిన వనాలు శ్మశానాలుగా దర్శనమిచ్చాయి. మంటల్లో చిక్కుకుని మరో 50 మందికి పైగా గాయపడ్డారు. చనిపోయిన వారిలో ఎక్కువ మంది లీరా ప్రాంతంలో కార్లలో ప్రయాణిస్తుండగా అగ్నికీలలు చుట్టుముట్టి మరణించారని అధికారులు చెప్పారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందన్నారు. 
 
పెడ్రొగో గ్రాండే ప్రాంతంలో శనివారం మొదలైన మంటలు దావానంలా వ్యాపించాయి.  రోడ్డుకిరువైపులా 20 కి.మీ పైగా దూరం వరకు తెల్లటి పొగ మేఘాలు కమ్మేశాయి. మంటలు ఆ ప్రాంతంలోని ఇళ్లకు కూడా వ్యాపించాయి. అక్కడి ప్రజలను అధికారులు ఖాళీ చేయించి, సురక్షిత ప్రదేశాలకు తరలించారు. మంటల్ని ఆర్పడానికి 900 మంది అగ్నిమాపక సిబ్బంది 300 వాహనాలతో ప్రయత్నిస్తున్నారు. మంటలను ఆర్పడానికి సాయపడే విమానాలను స్పెయిన్, ఫ్రాన్స్‌లు పోర్చుగల్‌కు పంపాయి. 
 
‘అటవీ అగ్ని ప్రమాదాల్లో ఇటీవలి కాలంలో ఇదే అతిపెద్ద విషాదం’ అని పోర్చుగల్‌ ప్రధాని ఆంటోనియో కోస్టా అన్నారు. వర్షం లేకుండానే పిడుగులు పడటం మంటలకు కారణం అయ్యుండొచ్చని పేర్కొన్నారు. ఆదివారం నుంచి మూడు రోజులను సంతాప దినాలుగా పోర్చుగల్‌ ప్రభుత్వం ప్రకటించింది.  
 
మంటల్లో చిక్కుకుని మృతి చెందిన వారికి భారత ప్రధాని మోదీ ట్వీటర్‌ ద్వారా సంతాపం తెలిపారు. ‘మంటల్లో అంతమంది చనిపోవడం బాధను కలిగిస్తోంది. ఈ విషాద సమయంలో పోర్చుగీసు ప్రజలకు నా సానుభూతి’ అంటూ మోదీ ఓ ట్వీట్‌ చేశారు. ఈ నెల 24న మోదీ పోర్చుగల్‌లో పర్యటించాల్సి ఉంది.
 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments