Webdunia - Bharat's app for daily news and videos

Install App

మద్యం మత్తులో జోగుతుంటే.. దెయ్యం పట్టిందని.. చేతులు కాల్చేశారు..

మద్యం మత్తులో జోగుతున్న మహిళకు దెయ్యం పట్టిందని నిప్పులు పట్టించిన ఘటన కొత్తగూడెం జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. కొత్తగూడెం అశ్వారావుపేట మండలంలోని నారంవారిగూడెం గ్రామ సమీప

Webdunia
ఆదివారం, 18 జూన్ 2017 (16:54 IST)
మద్యం మత్తులో జోగుతున్న మహిళకు దెయ్యం పట్టిందని నిప్పులు పట్టించిన ఘటన కొత్తగూడెం జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. కొత్తగూడెం అశ్వారావుపేట మండలంలోని నారంవారిగూడెం గ్రామ సమీపంలోని కొత్త కాలనీకి చెందిన వెంకమ్మ మే 19వ తేదీన మద్యం తాగిన మత్తులో తూలుతూ గ్రామంలో కలియతిరిగింది. ఆ సమయంలో మరో మహిళ తనకు దేవత పూనిందంటూ ఊగిపోయింది.
 
వెంకమ్మకు దెయ్యం పట్టిందని తెలిపింది. దెయ్యాన్ని వదిలించాలంటే ఆమె చేతుల్లో నిప్పులు పొయ్యాలని ఆదేశించింది. అంతే.. ఆమె ఆదేశాలను ఇద్దరు యువకులు అమలు పరిచారు. ఆమె చేతులను బలంగా పట్టుకుని ఆ చేతుల్లో నిప్పులు ఉంచారు. దీంతో ఆమె తీవ్రంగా కాలిపోయింది. ఆమె ఆర్తనాదాలు చేస్తున్నా వినిపించుకోలేదు. రెండు చేతులు తీవ్రంగా కాలిన తరువాత విడిచిపెట్టారు.
 
నెల రోజులు ముగిసినా ఆమె చేతులకైన గాయాలు మానలేదు. దీనిని గమనించిన పలువురు పెద్దలు పంచాయతీ పెట్టారు. బాధిత మహిళకు చికిత్స చేయించాలని, ఘటనకు కారణమైన వారిని ఆదేశించారు.

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments