Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూఎస్ పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోడీ

Webdunia
బుధవారం, 22 సెప్టెంబరు 2021 (13:27 IST)
అమెరికా పర్యటనకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బయలుదేరారు. బుధవారం ఉదయం గం.11.30 ప్రాంతంలో ప్రత్యేక విమానంలో ఆయన బయలుదేరి వెళ్లారు. మొత్తం మూడు రోజుల పాటు మోడీ యూఎస్‌లో పర్యటించనున్నారు.
 
ఈ సమయంలో ఆయన పలు కీలక భేటీల్లో పాల్గొంటారు. ఆస్ట్రేలియా, జపాన్, ఇంకా యుఎస్‌లతో జరుగబోతోన్న మొదటి క్వాడ్ ఇన్ పర్సనల్ సమావేశంలో పాల్గొనడమే భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పర్యటన ప్రధాన ఉద్దేశ్యం. 
 
దీంతోపాటు, న్యూయార్క్‌లో జరిగే ఐరాస జనరల్ అసెంబ్లీలో కూడా ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు. ఇక, ఈ పర్యటనలో అగ్రరాజ్య దేశాధ్యక్షుడు జో బైడెన్‌తో కూడా భారత ప్రధాని భేటీ అవుతారు. ఈ భేటీపైనే సర్వత్రా ఆసక్తి నెలకొంది. 
 
ముఖ్యంగా, ఆప్ఘనిస్థాన్‌ దేశాన్ని తాలిబన్ తీవ్రవాదులు హస్తగతం చేసుకోవడం, ఆ దేశ రాజకీయాల్లో పాకిస్థాన్, చైనా వంటి దేశాలు జోక్యం చేసుకోవడం వంటి పరిణామాలపై ఈ భేటీలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. అందుకే మోడీ, బైడన్ భేటీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మౌత్ పబ్లిసిటీ పై నమ్మకంతో చౌర్య పాఠం విడుదల చేస్తున్నాం : త్రినాథరావు నక్కిన

జూ.ఎన్టీఆర్ ధరించిన షర్టు ధర రూ.85 వేలా?

సైన్స్ ఫిక్షన్ యాక్షన్ చిత్రంగా కిచ్చా సుదీప్ తో బిల్లా రంగ బాషా ప్రారంభం

తన ముందే బట్టలు మార్చుకోవాలని ఆ హీరో ఇబ్బందిపెట్టేవాడు : విన్సీ అలోషియస్

Shivaraj Kumar: కేన్సర్ వచ్చినా షూటింగ్ చేసిన శివరాజ్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

తర్వాతి కథనం
Show comments