విమానంలో ఓవర్ లోడ్... కుప్పకూలి 19 మంది మృతి

ఓ విమాన సిబ్బంది పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకున్నందుకు భారీ మూల్యమే చెల్లించుకుంది. విమానం కుప్పకూలిపోవడంతో ఏకంగా 19 మంది మృత్యువాతపడ్డారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటన దక్షిణ

Webdunia
సోమవారం, 10 సెప్టెంబరు 2018 (09:44 IST)
ఓ విమాన సిబ్బంది పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకున్నందుకు భారీ మూల్యమే చెల్లించుకుంది. విమానం కుప్పకూలిపోవడంతో ఏకంగా 19 మంది మృత్యువాతపడ్డారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటన దక్షిణ సూడాన్‌లో జరిగింది.
 
నిజానికి ఈ విమానంలో కేవలం 19 మంది మాత్రమే ప్రయాణం చేయడానికి అనుమతి ఉంది. కానీ, విమాన సిబ్బంది మాత్రం 23 మందిని ఎక్కించుకున్నారు. ఈ ఫ్లైట్ జుబా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి యిరోల్‌ నగరానికి బయలుదేరిన కమర్షియల్ విమానం కాసేపటికే ఓ సరస్సులో కుప్పకూలింది. 
 
ప్రమాదంలో 19 మంది అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్ర గాయాలతో బయటపడిన నలుగురిలో ఆరేళ్ల బాలిక, మరో చిన్నారి, ఇటాలియన్ వైద్యుడు, ఓ యువకుడు ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వీరిలో వైద్యుడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిపారు. ప్రమాదంపై దర్యాప్తు జరుపుతున్నట్టు అధికారులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiru: నయనతార గైర్హాజరు - అనిల్ రావిపూడికి వాచ్ ని బహూకరించిన చిరంజీవి

యోగి ఆదిత్యనాథ్‌ కు అఖండ త్రిశూల్‌ ని బహూకరించిన నందమూరి బాలకృష్ణ

Prabhas: ప్రతి రోజూ ఆయన ఫొటో జేబులో పెట్టుకుని వర్క్ చేస్తున్నా : డైరెక్టర్ మారుతి

ప్రభాస్ స్పిరిట్ మూవీ ప్రారంభమైంది... చిరంజీవి ముఖ్య అతిథిగా..

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments