Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెపోలియన్ ఆత్మహత్య చేసుకునేందుకు ఉపయోగించిన పిస్తోళ్లకు భారీ ధర!!

వరుణ్
మంగళవారం, 9 జులై 2024 (11:32 IST)
ఫ్రాన్స్ సైన్యాధ్యక్షుడు, రాజకీయనేత నెపోలియన్ అలియాస్ నెపోలియన్ బోనపార్టే ఆత్మహత్య చేసుకునేందుకు ఉపయోగించిన పిస్తోళ్లను వేలం వేయగా, ఇవి భారీ ధర పలికాయి. ఫ్రాన్స్‌లో నిర్వహించినచ వేలం పాటల్లో ఈ రెండు పిస్తోళ్లు ఏకంగా 1.69 మిలియన్ యూరోలు పలికాయి. అమెరికన్ డాలర్లలో 1.8 మిలియన్ డాలర్ల మేరకు ధర పలికింది. ఈ మేరకు ఈ పిస్తోళ్లకు వేలం పాటలు నిర్వహించిన ఓసేనాట్ ఆక్షన్ అనే కంపెనీ వెల్లడించింది. అయితే ఈ పిస్తోళ్లను కొనుగోలు చేసినవారి పేర్లను మాత్రం గోప్యంగా ఉంచింది. పారిస్‌లోని ఫాంటైన్ బ్లూలో వేలాన్ని ఆదివారం నిర్వహించారు.
 
అయితే, ఈ పిస్టోళ్లను వేలం వేయడానికి ముందు రోజు వీటిని దేశ సంపదగా ఫ్రాన్స్ ప్రకటించింది. ఈ మేరకు ఆ దేశ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని జాతీయ కమిషన్ నిర్ణయాన్ని వెల్లడించింది. ఈ వస్తువులను జాతీయ సంపదగా వర్గీకరించామని, వాటిని విక్రయంపై నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు అధికారిక పత్రికా ప్రకటన కూడా విడుదల చేసింది. దీంతో వేలం పాటలో దక్కించుకున్న వ్యక్తుల నుంచి ఈ పిస్టోళ్లను ఫ్రాన్స్ ప్రభుత్వం తిరిగి దక్కించుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. 
 
30 నెలల వ్యవధిలో పిస్టోళ్లను తిరిగి కొనుగోలు చేయవచ్చు. సదరు వ్యక్తి నుంచి దక్కించుకునేందుకు ఫ్రాన్స్ ప్రభుత్వం కొనుగోలు ఆఫర్‌ను ప్రకటించాల్సి ఉంటుంది. అయితే ఈ ఆఫర్‌ను తిరస్కరించే హక్కు వేలంలో దక్కించుకున్న వ్యక్తికి ఉంటుంది. కాగా దేశ సంపదగా ప్రకటించిన ఏ వస్తువునైనా తాత్కాలికంగా మాత్రమే ఫ్రాన్స్ వెలుపలకు తీసుకెళ్లే అవకాశం ఉంటుందని ఆ దేశ నిబంధనలు చెబుతున్నాయి. ఆ తర్వాత తప్పనిసరిగా తిరిగి ఇవ్వాల్సి ఉంటుందని 'ఒసేనాట్ ఆక్షన్' ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు.
 
ఈ రెండు పిస్టోళ్లను బంగారం, వెండితో తయారు చేశారు. ఈ రెండు తుపాకులు సామ్రాజ్య వైభవంతో కనిపిస్తున్నాయి. 1814లో విదేశీ సైన్యం పారిస్‌ను ఆక్రమించుకోవడంతో నెపోలియన్ అధికారాన్ని వదులుకోవాల్సి వచ్చింది. తీవ్ర నిరాశ, ఒత్తిడికి లోనైన ఆయన ఈ తుపాకీలతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకోవాలని భావించారు. అయితే భూస్వామి ఒకరు తుపాకీలోని పౌడర్‌ను తొలగించారని వేలం సంస్థ నిపుణుడు జీన్-పియర్ ఒసేనాట్ వెల్లడించారు. తుపాకీ పనిచేయకపోవడంతో నెపోలియన్ విషం తాగారని, అయితే వాంతి కావడంతో ప్రాణాలతో బయటపడ్డారని, తన పట్ల విధేయత చూపిన ఆ భూస్వామికి ఈ పిస్టోళ్లను బహుమతిగా అందించారని వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి, బాలక్రిష్ణలకు IIFA ఉత్సవంలో ప్రత్యేక గౌరవం దక్కనుంది : ఆండ్రీ టిమ్మిన్స్

మత్తువదలరా పార్ట్ 3 కు ఐడియాస్ వున్నాయి కానీ... : డైరెక్టర్ రితేష్ రానా

టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ జానీపై పోక్సో కేసు!

బాలయ్య బెస్ట్ విషష్ తో హాస్యభరిత వ్యంగ చిత్రం పైలం పిలగా

శర్వానంద్, అనన్య, జై, అంజలి నటించిన జర్నీ రీ రిలీజ్‌కు సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments