Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడి కోసం సరిహద్దులను దాటి వచ్చిన పాక్ యువతి... తర్వాత ఏం జరిగింది?

Webdunia
మంగళవారం, 21 ఫిబ్రవరి 2023 (10:56 IST)
ప్రస్తుతం దేశాంతర, ఖండాంతర వివాహాలు కొత్తేమి కాదు. తాజాగా రెండు శత్రు దేశాలకు చెందిన యువతీయువకులకు పెళ్లి జరిగింది. పాకిస్థాన్‌కు చెందిన ఓ యువతి తన ప్రాణాలకు తెగించి దేశ సరిహద్దులను దాటుకుని భారత్‌లోకి అడుగుపెట్టింది. ఇక్కడ తన ప్రియుడిని వివాహం చేసుకుంది. ఈ విషయం బయటకు పొక్కడంతో భద్రతా బలగాలు ఆ యువతిని అదుపులోకి తీసుకుని మళ్లీ పాకిస్థాన్ సరిహద్దు భద్రతా బలగాలకు అప్పగించారు. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఇఖ్రా జీవానీ అనే ఓ పాకిస్థాన్‌కు చెందిన 19 యేళ్ల యువతి ఆన్‌లైన్‌లో లూడో గేమ్ ఆడుతూ ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ములాయం సింగ్ అనే 26 యేళ్ల యువకుడితో పరిచయమైంది. ఆ తర్వాత వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. అతన్ని వివాహం చేసుకునేందుకు ఆ యువతి సరిహద్దులను దాటి వచ్చింది. ఇందుకోసం ఆమె ఎన్నో కష్టాలుపడింది. 
 
ముందుగా పాకిస్థాన్ నుంచి నేపాల్‌కు చేరుకుంది. నేపాల్ రాజధాని ఖాట్మండుకు తన ప్రియుడిని రప్పించి అతన్ని కలుసుకుంది. మనసు విప్పి మాట్లాడింది. వారిద్దరూ అక్కడే పెళ్లి చేసుుకున్నారు. ఆ తర్వాత సరిహద్దు ప్రాంతమైన సనోలీ ప్రాంతం మీదుగా భారత్‌‍లోకి అడుగుపెట్టారు. 
 
ములాయం కొన్నేళ్లుగా బెంగుళూరులో ఉంటున్నాడు. దీంతో ఇఖ్రా కూడా భర్తతో వెళ్లి అక్కడే కాపురం పెట్టాలని నిర్ణయించుకున్నారు. పైగా, ఇఖ్రా తన పేరును హిందూ పేరును తలపించేలా రవా అని మార్చుకుంది. అయితే, ఆమె నమాజ్ చేస్తుండటంతో ఇరుగపొరుగువారు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
 
దీంతో ఇఖ్రాను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఆమె వద్ద లోతుగా విచారణ జరిపారు. ఈ విచారణంలో అసలు నిజం చెప్పారు. దీంతో ఆ యువతిని పంజాబ్ రాష్ట్రంలోని అమృతసర్‌కు తరలించారు. అక్కడ నుంచి అట్టారీ బోర్డర్ నుంచి పాకిస్థాన్‌కు తిప్పిపంపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments