Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య అక్రమ సంబంధం పెట్టుకోలేదనీ చంపి కాల్చి ఉడకబెట్టిన భర్త?

Webdunia
శుక్రవారం, 15 జులై 2022 (08:37 IST)
పాకిస్థాన్ దేశంలో దారుణం జరిగింది. ఈ దేశంలోని సింధ్ ప్రావిన్స్‌లో కట్టుకున్న భార్య అక్రమం సంబంధం పెట్టుకోలేదన్న అక్కసుతో కసాయి భర్త తన ఆరుగురు పిల్లల ముందే భార్యను చంపేశాడు. అప్పటికీ కసితీరకపోవడంతో భార్య శవాన్ని ముక్కలుగా చేసి వాటిని కాల్చి ఉడకబెట్టాడు. ఈ ఘటన పాకిస్థాన్‌లో సంచలనం రేపింది. నగరంలోని గుల్షన్ ఏ ఇక్బాల్ ప్రాంతంలో ఓ ప్రైవేటు స్కూలులోని వంట గదిలో నర్గీస్ మృతదేహాన్ని ఉడకబెట్టడాన్ని పోలీసులు కనుగొన్నారు. 
 
పోలీసుల కథనం మేరకు... బజౌర్ ఏజెన్సీకి చెందిన మహిళ భర్త అషిక్ పాఠశాలలో వాచ్‌మెన్‌గా పని చేస్తున్నాడు. ఈ పాఠశాల గత 9 నెలలుగా మూతబడివుంది. అయితే, ఆర్థిక కష్టాల్లో చిక్కుకోవడంతో భార్యను మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకోవాలని భర్త బలవంతం చేశాడు. దీనికి ఆమె నిరాకరించింది. దీంతో ఆగ్రహావేశాలకు లోనైన భర్త ఆమెను ఆరుగురు పిల్లల ఎదుటే కొట్టి చంపేశాడు. ఆ తర్వాత శవాన్ని ముక్కలు చేసి కాల్చి ఉడకబెట్టాడు. 
 
ఈ దారుణానికి పాల్పడిన తర్వాత ముగ్గురు పిల్లలతో అక్కడ నుంచి పారిపోయాడు. తండ్రి పారిపోయిన తర్వాత మృతురాలి 15 యేళ్ల పెద్ద కుమార్తె పోలీసులకు ఫోన్ చేసి చెప్పడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని మృతదేహం ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమన్నా భాటియాకు కష్టాలు- ఐదు గంటల పాటు ఈడీ విచారణ.. ఎందుకు? (video)

రాధికా ఆప్టే బేబీ బంప్ ఫోటోలు వైరల్

80 కిలోలు ఎత్తిన రకుల్ ప్రీత్ సింగ్, వెన్నెముకకు గాయం

ఆకాశంలో పొట్టేల్ ప్రమోషన్.. పాంప్లేట్లు పంచారు.. (video)

కాగింతపై రాసిచ్చిన దాన్ని తెరపై నటిగా ఆవిష్కరించా : నటి నిత్యామీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే అల్లం నీటిని తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

వరల్డ్ ట్రామా డే : ట్రామా అంటే ఏమిటి? చరిత్ర - ప్రాముఖ్యత

మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఏ సమస్యకు ఎలాంటి టీ తాగితే ప్రయోజనం?

గుంటూరు లోని ఒమేగా హాస్పిటల్‌లో నూతన కొలొస్టమి కేర్ క్లినిక్, పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments