Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాక్‌లో వైరైటీ రిపోర్టింగ్... పిచ్చి పీక్స్‌కి చేరింది అనేందుకు నిదర్శనం..

Webdunia
శుక్రవారం, 19 ఏప్రియల్ 2019 (09:22 IST)
ప్రస్తుతం మీడియా ఛానెళ్లు అత్యుత్సాహంతో వార్తా కథనాలను ప్రసారం చేస్తున్నారు. అందులో ఏ దేశానికి చెందిన వారైనా అతీతులు ఏమీ కారు. గతంలో కొన్ని సందర్భాల్లో ఇలాగే న్యూస్ కవరేజీ ఇస్తూ నవ్వులపాలు అయ్యారు. గతేడాది ప్రముఖ నటి మరణించినప్పుడు, ఆమె ఎలా మరణించింది, బాత్‌టబ్‌లో ఎలా శవమై పడి ఉంది అంటూ ఓ మీడియా ఛానెల్ రిపోర్టర్ వార్తను ప్రసారం చేసాడు. జర్నలిజంకి ఉన్న విలువలను తుంగలో తొక్కి నవ్వులపాలయ్యాడు. 
 
గతంలో పాకిస్థాన్‌లో కూడా ఇలాగే ఓ రిపోర్టర్ గాడిదపై ఎక్కి రిపోర్టింగ్ చేస్తూ బొక్క బోర్లాపడి సెన్సేషనల్ సృష్టిస్తే, తాజాగా మరొకరు మరీ లైవ్‌గా ఉంటుందని వరద నీళ్లలో నిలబడి రిపోర్టింగ్ చేసిన వైనం జర్నలిస్ట్ లోకాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. ఎవరూ తేలేని, ఏ ఛానెలూ కవర్ చేయని వార్తను తాను తీసుకురావాలంటూ ఓ ప్రొడ్యుసర్ హుకుం జారీ చేయడంతో సదరు జర్నలిస్ట్, తన ప్రాణాలకు తెగించి వరద నీటిలో ఇలా రిపోర్టింగ్ చేశాడంటూ నైలా ఇనయత్ అనే ఒక జర్నలిస్ట్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. 
 
లైవ్‌గా ఆ నీటిలోనే ఛాతీ వరకు నిలబడి అత్యంత సాహసంగా రిపోర్ట్ చేసేసరికి తమ ట్విట్టర్‌లలో నెటిజన్లు సెటైర్లతో విరుచుకుపడ్డారు. ఇదో పెద్ద కామెడీ ప్రహసనంలా తయారైందని ఒకరంటే.. మరొకరు ఇలాంటి వారికి పులిట్జర్ అవార్డు ఇవ్వాలంటూ జోకులు పేలుస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments