Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాన్నమ్మ జ్ఞాపకార్థం రూ.1.25 కోట్లు ఖర్చు పెట్టిన విందు ఇచ్చిన బెగ్గర్ ఫ్యామిలీ.. ఎక్కడ?

ఠాగూర్
మంగళవారం, 19 నవంబరు 2024 (16:06 IST)
చనిపోయిన తమ నాన్నమ్మ జ్ఞాపకార్థం పాకిస్థాన్‌కు చెందిన బెగ్గర్ ఫ్యామిలీ ఆ దేశ కరెన్సీ ప్రకారం రూ.1.25 కోట్లు ఖర్చు చేసి 20 వేల మందికి విందు భోజనం ఏర్ాటు చేశారు. పైగా, ఈ కార్యక్రమానికి వచ్చిన అతిథులకు 2 వేల వాహనాలను కూడా  ఏర్పాటు చేశారు. ఈ బిచ్చగాడి కుటుంబం పాకిస్థాన్ దేశంలోని గుజ్రన్‌వాలాలో ఉంది. గుజ్రాన్వాలాలోని రాహవలి రైల్వే స్టేషన్ సమీపంలో ఇటీవల ఈ విందును ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. బిచ్చగాడు కోట్లాది రూపాయలు ఖర్చు చేసి విందు ఏర్పాటు చేయడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
 
పంజాబ్ ప్రావిన్స్‌లోని ఈ ప్రాంతంలో ఇటీవల బిచ్చగాడి నానమ్మ చనిపోయింది. 40వ రోజు ఆమె జ్ఞాపకార్థం భారీ విందును ఏర్పాటు చేశారు. ఈ విందుకు తమకు తెలిసిన వారందరినీ ఆహ్వానించారు. పంజాబ్ ప్రావిన్స్‌లోని పలు ప్రాంతాల నుంచి వేలాదిమంది వచ్చారు. మరో ఆసక్తికర అంశం ఏమంటే అతిథులను వేదిక వద్దకు తరలించేందుకు దాదాపు 2 వేల వాహనాలను ఏర్పాటుచేశారు. ఈ విందులో వారి సంప్రదాయ వంటకాలైన సిరి పాయా, మురబ్బాలతో పాటు మాంసాహారం ఉండేలా చూసుకున్నారు. మటన్, స్వీట్ రైస్ కూడా పెట్టారు. ఈ విందు కోసం 250 మేకలను వధించినట్లుగా స్థానిక మీడియా కథనాల సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

'కాంటా లగా' ఫేమ్ షఫాలీ జరివాలా హఠాన్మరణం

రెండోసారి తల్లి అయిన గోవా బ్యూటీ...

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments