ఉగ్రవాది హఫీజ్ సయీద్ పార్టీని నిషేధించండి : ఈసీకి పాక్ సిఫారసు

లష్కరే తొయిబా (ఎల్‌ఈటీ) వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్‌‌కు పాకిస్థాన్ తేరుకోలేని షాకిచ్చింది. ఈయన ఉగ్రవాదాన్ని చట్టబద్దం చేయడంలో భాగంగా ఓ రాజకీయ పార్టీని స్థాపించారు. దీన్ని లష్కరే తోయిబా ఆధ్వర్యంలో మిల్లీ

Webdunia
శనివారం, 30 సెప్టెంబరు 2017 (11:39 IST)
లష్కరే తొయిబా (ఎల్‌ఈటీ) వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్‌‌కు పాకిస్థాన్ తేరుకోలేని షాకిచ్చింది. ఈయన ఉగ్రవాదాన్ని చట్టబద్దం చేయడంలో భాగంగా ఓ రాజకీయ పార్టీని స్థాపించారు. దీన్ని లష్కరే తోయిబా ఆధ్వర్యంలో మిల్లీ ముస్లిం లీగ్స్ (ఎంఎంఎల్) అనే పేరును పెట్టాలని నిర్ణయించారు. 
 
ఈమేరకు ఆయన ఎన్నికల సంఘానికి దరఖాస్తు కూడా చేసుకున్నారు. ఈ నేపథ్యంలో సయీద్ మద్దతిస్తున్న కొత్త పార్టీని నిషేధించాలని ఎన్నికల సంఘాన్ని పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల శాఖ ఆదేశించింది. ఈ నిర్ణయంతో సయీద్ షాక్‌కు గురయ్యారు. 
 
ఈ నెల 22వ తేదీన పాక్ జాతీయ ఎన్నికల సంఘానికి రాసిన లేఖలో 2008 ముంబై పేలుళ్ల సూత్రధారి హఫీజ్ సయీద్‌‌ను ఉగ్రవాదిగా భారత్, అమెరికాలు గుర్తించిన విషయాన్ని ప్రస్తావించింది. ఆ పార్టీ దరఖాస్తును తిరస్కరించాలని సూచించింది. కాగా, హఫీజ్ సయీద్ ప్రస్తుతం గృహనిర్బంధంలో ఉన్న సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాంకర్ శివజ్యోతి ఆధార్ కార్డును టిటిడి బ్లాక్ చేసిందా? (video)

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం నిర్మిస్తున్నతిమ్మరాజుపల్లి టీవీ మూవీ ఫస్ట్ సింగిల్

Naresh Agastya: శ్రీవిష్ణు క్లాప్ తో నరేష్ అగస్త్య కొత్త చిత్రం ప్రారంభం

Mowgli 2025: రోషన్ కనకాల, సాక్షి మడోల్కర్... వనవాసం సాంగ్ రిలీజ్

అనిల్ రావిపూడి ఆవిష్కరించనున్న అన్నగారు వస్తారు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

తర్వాతి కథనం
Show comments