Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాళ్ళబేరానికి వచ్చిన పాకిస్థాన్ : సింధు జలాల రద్దు పునఃసమీక్షించండంటూ విజ్ఞప్తి

ఠాగూర్
బుధవారం, 14 మే 2025 (21:55 IST)
సింధూ జలాల ఒప్పందం రద్దుపై పాకిస్థాన్ కాళ్లబేరానికి వచ్చింది. ఈ విషయంలో తన వైఖరిని పునఃసమీక్షించుకోవాలని భారత్‌కు విజ్ఞప్తి చేసింది. సింధూ జలాల ఒప్పందం నిలిపివేత వల్ల జరిగే నష్టం ఏంటో పాకిస్థాన్‌కు తెలుసొచ్చింది. మొన్నటివరకు ఈ అంశంలో తీవ్ర స్వరంతో మాట్లాడిన దాయాది ఇపుడు ఆత్మరక్షణలో పడినట్టు తెలుస్తోంది. కాల్పుల విరమణకు అంగీకరించిన భారత్.. సింధూ జలాల విషయంలో వెనక్కి తగ్గేదే లే అని ప్రకటించడంతో ఇపుడు కాళ్ళ బేరానికి వచ్చింది. నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలంటూ కోరింది. ఈ మేరకు భారత ప్రభుత్వానికి లేఖ రాసింది. 
 
సింధూ జలాలు నిలిపివేస్తే పాక్‌లో తీవ్ర దుర్బిక్షం నెలకొంటుందంటూ భారత జలశక్తి మంత్రిత్వ శాఖకు పాక్ జలవనరుల శాఖ లేఖ రాసినట్టు సమాచారం. ఈ విషయంపై చర్చించేందుకు పాక్ సిద్ధంగా ఉందని పేర్కొంది. ప్రోటోకాల్‌లో భాగంగా ఈ అంశాన్ని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు పంపినట్టు తెలుస్తోంది. అయితే, రక్తం, నీరు, రెండూ కలిసి ప్రవహించలేదంటూ ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని ప్రధాని మోడీ ఇప్పటికే స్పష్టం చేశారు. పాక్‌తో చర్చలంటూ జరిగితే ఉగ్రవాదం, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌పైనే అని పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'శుభం' మూవీ చూస్తున్నంత సేవు కడుపుబ్బా నవ్వుకున్నా... సమంత తల్లి ట్వీట్

Santhanam: డీడీ నెక్ట్స్ లెవల్: రోడ్డున పోయే ప్రతి ఒక్కరికీ సమాధానం చెప్పాల్సిన పనిలేదు..

బద్మాషులు నుండి లోకం మారిందా.. సాంగ్ రిలీజ్

23 లాంటి సినిమా తీయడం ఫిల్మ్ మేకర్ గా వెరీ ఛాలెంజింగ్ : డైరెక్టర్ రాజ్ ఆర్

రెట్రో మిస్ అయినా, మాస్ జాతర వరించింది, కామెడీ కూడా చేయబోతున్నా : నవీన్ చంద్ర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

తర్వాతి కథనం
Show comments