Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రతీకారం కోసం తపన : 26/11 తరహా దాడులకు పాకిస్థాన్ పక్కా ప్లాన్

భారత్ జరిపిన సర్జికల్ దాడులకు ప్రతీకారం తీర్చుకునే పనిలో పాకిస్థాన్ పాలకులు నిమగ్నమైవున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐతో పాటు ఆ దేశ ఆర్మీలు కలిసి 26/11 తరహా దాడులకు పాల్పడేందుక

Webdunia
శనివారం, 29 అక్టోబరు 2016 (08:39 IST)
భారత్ జరిపిన సర్జికల్ దాడులకు ప్రతీకారం తీర్చుకునే పనిలో పాకిస్థాన్ పాలకులు నిమగ్నమైవున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐతో పాటు ఆ దేశ ఆర్మీలు కలిసి 26/11 తరహా దాడులకు పాల్పడేందుకు పక్కా ప్రణాళికను రూపొందిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ వ్యూహరచనలో భాగంగా భారత రక్షణ వ్యవస్థ కీలక సమాచారాన్ని సేకరించేందుకే పాక్‌ హైకమిషన్‌ కార్యాలయ ఉద్యోగి మహ్మద్‌ అక్తర్‌ను నియమించినట్టు చెబుతున్నాయి. 
 
ఈ విషయం అతడిని అరెస్టు చేసి విచారించిన పలు కీలక అంశాలను వెల్లడించినట్లు భద్రతాధికారులు తెలిపారు. అతడిని వాంగ్మూలాన్ని వీడియో రికార్డింగ్‌ చేశారు. భారత పశ్చిమ తీరం వెంబడి భద్రతాదళాల మోహరింపునకు సంబంధించిన కీలక సమాచారాన్ని అక్తర్‌ సేకరించాడు. 
 
పాక్‌ హైకమిషన్‌ కార్యాలయంలో గూఢచర్యానికి పాల్పడుతున్న పలువురు అధికారుల పేర్లనూ వెల్లడించినట్లు సమాచారం. కాగా, మూడేళ్లుగా తాను అక్తర్‌తో సంబంధాలు కలిగివున్నట్టు జోధ్‌పూ‌ర్‌లో అరెస్టయిన ఉగ్రవాది సోహయిబ్‌ శుక్రవారం పోలీసుల విచారణలో వెల్లడించిన విషయం తెల్సిందే. ఇతను ఇచ్చిన సమాచారం మేరకు పాక్ దౌత్య సిబ్బందిని ఎన్.ఐ.ఏ అరెస్టు చేసింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

థ్రిల్లర్ గా అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments