Webdunia - Bharat's app for daily news and videos

Install App

వణికిపోతున్న పాకిస్థాన్.. మీరే రక్షించాలంటూ ఐక్యరాజ్య సమితిలో శరణు

Webdunia
మంగళవారం, 19 ఫిబ్రవరి 2019 (15:29 IST)
పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్ సంసిద్ధమవుతోంది. దీంతో పాకిస్థాన్ వెన్నులో వణుకు మొదలైంది. భారత్ సైనిక చర్యకు దిగకుండా శాంతింపజేయాలంటూ ఐక్యరాజ్య సమితిలో పాకిస్థాన్ విదేశాంగ శాఖ మంత్రి షా మహ్మద్ ఖురేషీ కోరారు. ఈ మేరకు ఆయన ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్స్‌కు లేఖ రాశారు. 
 
"పాకిస్థాన్‌పై భారత్ తన సైన్యాన్ని ప్రయోగించే అవకాశం ఉండడంతో మా ప్రాంతంలో భద్రతా పరిస్థితి క్షీణిస్తోంది. దీనిపై వెంటనే జోక్యం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను" అని ఖురేషీ సదరు లేఖలో విదేశాంగ శాఖ కోరింది. కాగా కాశ్మీర్ అంశంపై మూడో పార్టీ ప్రమేయాన్ని భారత్ తిరస్కరిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. భారత్-పాక్ వ్యవహారాలను కేవలం ద్వైపాక్షిక చర్చల ద్వారా మాత్రమే పరిష్కరించుకోవాల్సి ఉంటుందని భారత్ స్పష్టంగా చెబుతోంది.
 
దేశంలోని రాజకీయ కారణాల కోసం భారత్ కావాలని తమపై శత్రు భావాన్ని ప్రదర్శించి, ఉద్రిక్తతలు పెంచుతోందని ఆయన ఆరోపించారు. ఈ నెల 14న కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో జరిగిన ఆత్మాహుతి దాడిలో 49 మంది సీఆర్‌పీఎఫ్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడి వెనుక పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ ఉందని భారత్ చెబుతుండగా... తమకు సంబంధం లేదని పాకిస్థాన్ బుకాయిస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments