Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్ 48వేల మార్కును దాటిన కరోనా కేసులు.. 48మంది మృతి

Webdunia
గురువారం, 21 మే 2020 (19:49 IST)
ప్రపంచ దేశాలను కరోనా వణికిస్తున్న సంగతి తెలిసిందే. భారత్‌లో లక్ష దాటిన కరోనా కేసులు.. పాకిస్థాన్‌లో 48వేల మార్కును దాటేసింది. గడిచిన 24 గంటల్లో పాకిస్థాన్‌లో 2193 కరోనా కేసులు నమోదైనాయి. ఫలితంగా కరోనా కేసుల సంఖ్య 48,091కి చేరుకుంది. 
 
అలాగే గడిచిన 24 గంటల్లో కరోనాతో 32 కరోనా మరణాలు సంభవించడంతో మొత్తం మృతుల సంఖ్య 1,017కు చేరుకుంది. ఇప్పటి వరకూ 14 వేలకు పైగా కరోనా బాధితులు వ్యాధి నుంచి కోలుకున్నారు. ఇక సింధ్ ప్రావిన్స్‌లో అత్యధికంగా దాదాసు 19 వేల కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాతి స్థానంలో పంజాబ్ ప్రావిన్స్ నిలిచింది. అక్కడ 17382 కేసులు నమోదయ్యాయి. 
 
ఇదేవిధంగా పాక్ రాజధాని ఇస్లామాబాద్‌లో 1235 కేసులుండగా, పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లో 148 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా మొత్తం 4.3 లక్షల పరీక్షలు చేపట్టినట్టు పాక్ ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments