Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆంధ్రాలో మరో 45 కరోనా పాజిటివ్ కేసులు

ఆంధ్రాలో మరో 45 కరోనా పాజిటివ్ కేసులు
, గురువారం, 21 మే 2020 (14:54 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో 45 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిజానికి రెండు మూడు రోజులుగా ఈ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వచ్చాయి. కానీ, గురువారం ఒక్కసారిగా ఈ కేసులు పెరిగాయి. బుధవారం 9 గంటల నుంచి గురువారం 9 గంటల వరకు 24 గంటల వ్యవధిలో మరో 45 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. 
 
కొత్తగా నమోదైన కేసులతో కలిపితే ఏపీలో మొత్తం 2,452కి చేరుకుంది. గురువారంఒకరు మృతి చెందగా.. కరోనాతో ఇప్పటివరకు 54మంది మృతి చెందారు. కరోనాతో మరణించిన వ్యక్తిని నెల్లూరు వాసిగా గుర్తించారు. కాగా, ప్రస్తుతం ఏపీలో మొత్తం 1,680మంది కరోనాను జయించి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 718. గత 24 గంటలుగా 8,092 శాంపిల్స్‌ను పరీక్షించగా 45 మంది కోవిడ్19 పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. కొత్తగా 41 మంది కోవిడ్ నుంచి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ చేయబడ్డారు. 
 
ఇదిలావుంటే, ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కూలీల్లో 153 మందికి ఈ వైరస్ సోకింది. వీరిలో మహారాష్ట్రకు చెందిన వారు 101 మంది ఉండగా, గుజరాత్ నుంచి 26, కర్నాటక్ 1, వెస్ట్ బెంగాల్ 1, రాజస్థాన్ 11, తమిళనాడు 3 చొప్పున ఉన్నాయి. ఇందులో 128 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కంటైన్మెంట్ ప్రాంతాల్లో మినహా మిగిలి చోట్ల... కండిషన్స్ అప్లై