Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనా టీకా వేసుకున్న పాకిస్థాన్ అధ్యక్షుడికి కరోనా పాజిటివ్

Webdunia
సోమవారం, 29 మార్చి 2021 (20:36 IST)
కరోనా వైరస్ ఏ ఒక్కరినీ వదిలిపెట్టడం లేదు. సాధారణ ప్రజల నుంచి వీవీఐపీ వరకు ఈ వైరస్ సోకుతోంది. ఇటీవలే పాకిస్థాన్ ప్రధానమంత్రి ఈ వైరస్ బారినపడ్డారు. ఇపుడు ఆ దేశ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ కూడా మహమ్మారి బాధితుల జాబితాలో చేరారు. 
 
ఆరిఫ్ అల్వీకి కరోనా పరీక్షల్లో పాజిటివ్ అని వెల్లడైంది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. తాను ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నానని, కానీ శరీరంలో యాంటీబాడీలు వృద్ధి చెందాలంటే రెండో డోసు తప్పనిసరి అని వివరించారు. 
 
మరో వారంలో రెండో డోసు తీసుకోవాల్సి ఉందని, ఈలోపే కరోనా సోకిందని ఆరిఫ్ అల్వీ విచారం వ్యక్తం చేశారు. అయితే, ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
 
ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా చైనా తయారీ కరోనా వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్న తర్వాత కరోనా బారినపడ్డారు. కరోనా సోకినప్పటికీ తన మీడియా బృందంతో సమావేశం నిర్వహించి విమర్శలపాలయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments