Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాబ్బాబు.. మీతో చర్చలు జరుపుతాం : భారత్‌తో కాళ్ళబేరానికి పాకిస్థాన్

Webdunia
గురువారం, 28 ఫిబ్రవరి 2019 (16:25 IST)
పాకిస్థాన్ కాళ్ళబేరానికి వచ్చింది. అన్ని సమస్యలపై భారత్‌తో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించింది. ఇందుకోసం ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానిస్తున్నట్టు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆ దేశ మీడియా ద్వారా ప్రకటించారు. దీనికంతటికీ కారణం.. అంతర్జాతీయంగా పాకిస్థాన్ కావడమే. భారత్ దౌత్యనీతితో పాక్‌ను అంతర్జాతీయంగా ఏకాని చేస్తోంది. చివరకు తమకు అండగా నిలబడుతుందని నమ్మిన చైనా కూడా చివరకు పాకిస్థాన్‌కు హ్యాండిచ్చింది. దీంతో పాకిస్థాన్ కాళ్ళబేరానికి వచ్చి చర్చల ప్రతిపాదనను తెలపైకి తెచ్చింది. 
 
పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ పీవోకేలోని జైష్ ఉగ్రతండాలపై వైమానిక దళంతో మెరుపుదాడులు చేయించింది. దీంతో పాకిస్థాన్ రెచ్చిపోయి భారత్‌పై దాడికి యత్నించింది. ఈ దాడులను భారత సైనికులు సమర్థంగా తిప్పికొట్టారు. ఈ పరిణామాల నేపథ్యంలో సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. 
 
అదేసమయంలో అంతర్జాతీయ సమాజం కూడా పాకిస్థాన్‌పై తీవ్రమైన ఒత్తిడి చేస్తోంది. దీంతో పాకిస్థాన్ దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. రెండు దేశాల మధ్య నెలకొన్న పరిస్థితులు సద్దుమణగడానికి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఫోన్‌‌లో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నాడని ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి షా మెహమ్మద్ ఖురేషి ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

Kavya Kalyan Ram: గ్లామ‌ర‌స్ చిత్రాలలో నటించేందుకు సిద్ధమైన కావ్య క‌ళ్యాణ్ రామ్‌

కంటెంట్ ఈజ్ కింగ్ అని వైల్డ్ బ్రీత్ సినిమా ప్రూవ్ చేస్తుంది - శివాజీ రాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments