పాకిస్థాన్ అసెంబ్లీ స్పీకర్‌కు పాజిటివ్.. ప్రధాని ఇమ్రాన్‌కు పరీక్షలు

Webdunia
శుక్రవారం, 1 మే 2020 (11:15 IST)
కరోనా బాధిత దేశాల్లో పాకిస్థాన్ ఒకటి. ఈ దేశంలో కూడా కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇపుడు ఆ దేశ అసెంబ్లీ స్పీకర్ అసద్ ఖైసర్‌కి కూడా కరోనా వైరస్ సోకినట్టు తేలింది. అలాగే, ఈయన కుమారుడు, కుమార్తెకు కూడా ఈ వైరస్ సోకినట్టు వైద్యులు నిర్ధారించారు. మరోవైపు, ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు కూడా కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. 
 
పాకిస్థాన్ నేషనల్ అసెంబ్లీ స్పీకర్‌గా ఖైసర్‌ కొనసాగుతున్నారు. ఈయన కరోనా లక్షణాలతో బాధపడుతుంటే గురువారం పరీక్షలు చేశారు. ఈ పరీక్షల్లో కరోనా‌ పాజిటివ్‌గా తేలింది. దీంతో ఖురేషీతోపాటు ఆయన కుటుంబసభ్యులను అధికారులు క్వారెంటైన్‌కు తరలించారు. 
 
అయితే, స్పీక‌ర్ ఖురేషి రెండు రోజుల క్రితం ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్‌తో స‌మావేశం కావ‌డం ఇప్పుడు ఆందోళ‌న క‌లిగిస్తున్న‌ది. దీంతో ముందు జాగ్రత్తగా ప్రధానికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. మరోవైపు స్పీకర్ ఖురేషి‌ ఎవరెవరిని కలిశారో గుర్తించి అంద‌రినీ క్వారెంటైన్‌కు త‌ర‌లిస్తున్నారు. 
 
మరోవైపు, పాకిస్థాన్‌లో ప్రస్తుతం మొత్తం 16819 నిర్ధారణ కేసులు ఉన్నాయి. అలాగే, 385 మంది ఈ వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోగా 4315 మంది చికిత్స పొంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 3.26 మిలియన్ కేసుల నమోదుకాగా, 233 వేల మంది మృత్యువాతపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Srinidhi Shetty: సీత పాత్ర మిస్ అయ్యా, వెంకటేష్, త్రివిక్రమ్ సినిమాలో చేయాలనుకుంటున్నా : శ్రీనిధి శెట్టి

Marriage Rumors: పెళ్లికి రెడీ అవుతున్న త్రిష.. చండీగఢ్‌ వ్యాపారవేత్తతో డుం.. డుం.. డుం..?

Teja: నటి సంతోషిని హెల్త్ కేర్ రిహాబిలిటేషన్ సెంటర్ లో దర్శకుడు తేజ

Charmi Kaur: విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్

అరి.. ప్రయాణంలో తండ్రిని, బావని కోల్పోయిన దర్శకుడు ఎమోషనల్ పోస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బాదం పాలు తాగుతున్నారా?

ఈ దీపావళికి, ఫ్రెడెరిక్ కాన్‌స్టాంట్ తమ హైలైఫ్ లేడీస్ క్వార్ట్జ్ పండుగ బహుమతులు

బాలబాలికలకు శ్రీకృష్ణుడు చెప్పిన 8 ముఖ్యమైన సందేశాలు

దీపావళి డ్రెస్సింగ్, డెకర్: ఫ్యాబ్ఇండియా స్వర్నిమ్ 2025 కలెక్షన్‌

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments