Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ దెబ్బకు ఎండిపోతున్న పాక్ నదులు... ఖరీఫ్ సీజన్ నుంచే నీటి కటకటా

ఠాగూర్
మంగళవారం, 6 మే 2025 (12:37 IST)
పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‌పై భారత్ కన్నెర్రజేసింది. ఇందులోభాగంగా, అనేక రకాలైన ఆంక్షలను విధించింది. ముఖ్యంగా ఇరు దేశాల మధ్య ఉన్న సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. ఈ నిర్ణయం పాకిస్థాన్‌కు ఊహించని విధంగా షాక్ కొట్టినట్టయింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో పాకిస్థాన్‌కు వెళ్లే జలాలు ఆగిపోయాయి. ఫలితంగా నీటి కష్టాలు మొదలయ్యాయి. ఈ కష్టాలు ఈ యేడాది రబీ సీజన్ నుంచే మొదలుకానున్నాయి. ఇప్పటికే పలు పాకిస్థాన్ కాలువలు ఎండిపోయి కనిపిస్తున్నాయి. 
 
ఈ ఒప్పందం రద్దుతో ఇండస్ రివర్ సిస్టమ్ అథారిటీ (ఐఎస్ఆర్ఏ) అంచనా ప్రకారం... సింధూ నదీ జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేయడంతో ఆ ప్రభావం పాకిస్థాన్‌కు వెళ్ళే నీటిలో 21 శాతం మేరకు కోతపడొచ్చని పేర్కొంది. ముఖ్యంగా చినాబ్ నదిలో నీటి లభ్యతలో తగ్గుదలే దీనికి కారణం అవుతుందని తేల్చింది. ఇప్పటికే సలాల, బిగ్ లిహార్ డ్యామ్ గేట్లు మూసివేయడంతో పాక్‌కు వెళ్లేనీరు చాలా వరకుతగ్గింది. 
 
మరాల వద్ద నీటి కొరత దృశ్యాలు ఇప్పటికే కనిపిస్తున్నాయి. దీని ప్రభావం ఖరీఫ్ సీజన్‌పై పడనుంది. ఇలాంటి చర్యలే కిషన్ గంగాపై కూడా భారత్ భావిస్తోంది. మే నుంచి సెప్టెంబరు వరకు ఖరీఫ్ సీజన్‌కు నీటి లభ్యతను అంచనా వేయడానికి ఐఎస్ఆర్ఏ సమావేశమైంది. ఇందులో పలు అంశాలపై చర్చించి ఓ అంచనా వేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' రిలీజ్‌కు ముందు మంచు విష్ణుకు షాకిచ్చిన జీఎస్టీ అధికారులు

డబ్బుల కోసం సినిమాలు చేయాలని లేదు, కన్నప్ప లో ప్రభాస్, విష్ణు పాత్రలు హైలైట్ : శివ బాలాజీ

ఎంటర్టైన్మెంట్, లవ్ స్టోరీ వర్జిన్ బాయ్స్ కి సెన్సార్ నుండి ఏ సర్టిఫికెట్

శ్రీశైలం దర్శనంతో ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ముగించిన మంచు విష్ణు

Kannappa first review : మంచు విష్ణు చిత్రం కన్నప్ప ఫస్ట్ రివ్యూ చెప్పేసిన నటుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

దివ్యాంగ విద్యార్ధుల కోసం నాట్స్ ఉచిత బస్సు, విశాఖలో బస్సును లాంఛనంగా ప్రారంభించిన ఎంపీ భరత్

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments