Webdunia - Bharat's app for daily news and videos

Install App

సర్జికల్ దాడులు జరగనేలేదు... జరిగివుంటే తిప్పికొట్టివుండేవాళ్లం : పాక్ హై కమిషనర్ అబ్దుల్ బాసిత్

భారత ఆర్మీ నిజంగా తమ భూభాగంలోకి ప్రవేశించి సర్జికల్ దాడులు జరపలేదని, ఒకవేళ అలాంటి దాడులు జరిగివుంటే ఖచ్చితంగా తమ దేశ ఆర్మీ తిప్పికొట్టివుండేదని పాకిస్థాన్ హై కమిషనర్ అబ్దుల్ బాసిత్ అన్నారు.

Webdunia
గురువారం, 13 అక్టోబరు 2016 (11:07 IST)
భారత ఆర్మీ నిజంగా తమ భూభాగంలోకి ప్రవేశించి సర్జికల్ దాడులు జరపలేదని, ఒకవేళ అలాంటి దాడులు జరిగివుంటే ఖచ్చితంగా తమ దేశ ఆర్మీ తిప్పికొట్టివుండేదని పాకిస్థాన్ హై కమిషనర్ అబ్దుల్ బాసిత్ అన్నారు. సర్జికల్ దాడులపై ఆయన మరోమారు స్పందిస్తూ... గతనెల 29న నియంత్రణ రేఖ వెంబడి ఉన్న ఉగ్రవాదుల స్థావరాలపై మెరుపు దాడులు నిర్వహించి పలువురు ఉగ్రవాదులను భారత దళాలు హతమార్చిన వార్తల్లో ఏమాత్రం నిజం లేదన్నారు. అసలు సర్జికల్ దాడులంటూ ఏవీ జరగలేదన్నారు. అదే కనుక జరిగి ఉంటే పాక్ బలగాలు వెంటనే తిప్పికొట్టివుండేవన్నారు. 
 
ఇక భారత్‌కు చెందిన ఓ టెలివిజన్ చానల్ మిర్పూర్‌లోని పాక్ పోలీసు అధికారితో మాట్లాడినట్టు చెబుతున్నదంతా బూటకమన్నారు. అది పూర్తిగా ఫ్యాబ్రికేట్ చేసిన సంభాషణ అని తేల్చి చెప్పారు. "అక్కడసలు సర్జికల్ స్ట్రయిక్స్ జరగనే లేదు. జరిగినవి కేవలం ఇరువర్గాల మధ్య కాల్పులే. ఆ ఘటనలోనే ఇద్దరు పాక్ సైనికులు మృతిచెందారు. నిజానికి భారత్ చెబుతున్నట్టు సర్జికల్ స్ట్రయిక్స్ కనుక జరిగి ఉంటే పాక్ వెంటనే వాటిని తిప్పి కొట్టేది. ఒక్క భారత సైనికుడు కూడా సరిహద్దు దాటలేదు" అని ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాసిత్ స్పష్టం చేశారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ హిరణ్యకశిపు ప్రోమో రిలీజ్

పాకీజాకు పవన్ అండ... పవర్ స్టార్ కాళ్ళు మొక్కుతానంటూ వాసుకి భావోద్వేగం

పోలీస్ వారి హెచ్చరిక లోని పాటకు పచ్చజెండా ఊపిన ఎర్రక్షరాల పరుచూరి

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

తర్వాతి కథనం
Show comments