Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్‌ను మంచేసిన భారీ వరదలు.. వెయ్యి మంది మృతి

Webdunia
సోమవారం, 29 ఆగస్టు 2022 (09:02 IST)
దాయాది దేశం పాకిస్థాన్‌ను భారీ వరదలు ముంచెత్తాయి. గత 30 యేళ్ళలో ఎన్నడూ లేని విధంగా ఆ దేశాన్ని వరదలు తాకాయి. ఈ వరద నీటి ప్రవాహం దెబ్బకు అనేక ప్రాంతాల్లో దాదాపు 150కిపైగా వంతెనలు కొట్టుకునిపోయాయి. అలాగే, వెయ్యిమందికిపైగా వరద బాధితులు మృత్యువాతపడ్డారు. దీంతో పాకిస్థాన్‌కు సాయం అందించేందుకు ఖతర్, ఇరాన్ వంటి దేశాలు ముందుకు వచ్చాయి. 
 
గత కొన్ని రోజులుగా పాకిస్థాన్ దేశాన్ని భారీ వర్షాలు ముంచెత్తున్నాయి. దీంతో భారీ వదలు సంభవించాయి. ఈ వరదల కారణంగా ఇప్పటివరకు 1033 మంది చనిపోయినట్టు పాకిస్థాన్ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. గత 24 గంటల్లోనే 119 మంది మృత్యువాతపడినట్టు తెలిపింది. అలాగే, ఈ వరదల కారణంగా 1500 మంది వరకు గాయపడినట్టు పాకిస్థాన్ జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. 
 
పాకిస్థాన్ దేశంలో ఈ తరహాలో వర్షాలు కురవడం, వరదలు సంభవించడి గత 30 యేళ్ళలో ఇది తొలిసారి కావడం గమనార్హం. సాధారణంగా పాక్‌లో సగటు వర్షపాతం 132.3 మిల్లీమీటర్లుగా ఉంటుంది. ఈ యేడాది జూన్ నుంచి ఇప్పటివరకు ఏకంగా 385 మిల్లీ మీటర్ల వర్షంపాతం నమోదైంది. 
 
ఈ వర్షాల కారణంగా అనేక ప్రాంతాలు నీట మునిగాయి. ఫలితంగా దాదాపు 3.30 కోట్ల మంది వరద బాధితులయ్యారని వెల్లడించారు. వరద బాధితులను ఆదుకునేందుకు పాక్ ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మన వాళ్లు టాలెంట్ చూపించాలనే డ్యాన్స్ ఐకాన్ 2 - వైల్డ్ ఫైర్ చేస్తున్నాం : హోస్ట్ ఓంకార్

అమ్మ రాజశేఖర్ తల మూవీ రివ్యూ

మారుతీ టీమ్‌ ప్రొడక్ట్, జీ స్టూడియోస్ నిర్మిస్తున్న బ్యూటీ లుక్, మోషన్ పోస్టర్

వి వి వినాయక్ ఆవిష్కరించిన పూర్ణ ప్రదాన పాత్రలోని డార్క్ నైట్ టీజర్

జగన్నాథ్ మూవీ హిట్‌ని మ‌న‌స్పూర్తిగా కోరుకుంటున్నా: మంచు మనోజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

మధుమేహం వ్యాధికి మెంతులు అద్భుతమైన ప్రయోజనాలు

మునగ ఆకుల టీ ఒక్కసారి తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments