Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్‌లో భూకంపం.. తొమ్మిది మంది మృతి.. 160 మంది గాయాలు

Webdunia
బుధవారం, 22 మార్చి 2023 (11:04 IST)
పాకిస్థాన్‌లో భూకంపం ఏర్పడింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.5పాయింట్లుగా నమోదైంది. భూకంపం కారణంగా తొమ్మిది మంది చనిపోయారని, మరో 160 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. 
 
మంగళవారం రాత్రిపూట భూమి కంపించడంతో పాక్ ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. దీంతో ఇళ్లల్లో నుంచి బయటకు పరుగులు తీశారు. పాక్‌లోని లాహోర్, ఇస్లామాబాద్, రావల్పిండి, క్వెట్టా, పెషావర్, కోహట్, లక్కీ మార్వాత్ సిటీలలో భూమి కంపించింది. పలుచోట్ల భవనాలు నేల కూలాయి. 
 
మరోవైపు, ఆఫ్ఘానిస్తాన్, భారత్, తుర్కెమెనిస్తాన్, కజకిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, చైనాలలో కూడా భూకంప ప్రభావం కనిపించిందని ఇంటర్నేషనల్ సిస్మలాజికల్ సెంటర్ ఓ ప్రకటనలో తెలిపింది. 
 
ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లోని జనం భూకంపానికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. పాక్, ఆఫ్ఘాన్‌లలో సంభవించిన భూకంప ప్రభావం భారత్‌లోనూ కనిపించింది.

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments