Webdunia - Bharat's app for daily news and videos

Install App

మళ్లీ పాకిస్తాన్ పిల్లిమొగ్గలు... బుద్ధి చెప్పిన భారత్...

Webdunia
మంగళవారం, 5 మార్చి 2019 (17:14 IST)
భారత్ పాకిస్తాన్‌ల మధ్య శాంతి నెలకొందని మనమనుకుంటున్న సందర్భంలో, పాకిస్తాన్ మాత్రం దీనికి విరుద్ధంగా ప్రవర్తిస్తోంది. భారత్‌ను ఏదోవిధంగా దెబ్బతీయాలని ప్రయత్నిస్తోంది. సైనిక స్థావరాలు, పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడి చేయాలనుకుంటోంది. ఈ క్రమంలో సోమవారం ఉదయం రాజస్థాన్ సరిహద్దులో భారత గగనతలంలోకి పాకిస్తాన్ డ్రోన్ ప్రవేశించింది. 
 
బీఎస్ఎఫ్ దళాలు దానిని పసిగట్టి వెంటనే కుప్పకూల్చాయి. సుఖోయ్ 30 MKI యుద్ధ విమానంతో పాకిస్తాన్ UAV (మానవరహిత వాయు వాహనం)ని కూల్చినట్లు ఎఎన్ఐ వార్తాసంస్థ వెల్లడించింది. బీకనేర్ నాల్ సెక్టార్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. కానీ పాకిస్తాన్ మాత్రం దీనిని సమర్థించుకోవాలనుకుంటోంది. బుకాయింపులు మొదలుపెట్టింది. 
 
పాకిస్తాన్‌కి చెందిన జిల్లాలోకి భారత జలాంతర్గామి ప్రవేశించిందని, దానిని మేము సమర్థవంతంగా ఎదుర్కొన్నామని చెప్పింది. దీనికి సంబంధించి వీడియోని కూడా రిలీజ్ చేసింది. అయితే భారత నేవీ వర్గాలు మాత్రం వీడియో ప్రామాణీకతను నిర్ధారిస్తున్నామని, కానీ ఇది పాత వీడియో అనిపిస్తోందని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments