Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనా ఉత్పత్తులకు భారత్‌కు ఢోకా లేదు.. భారత్ రేడియో, టీవీలపై పాక్ నిషేధం అమలు..

చైనా ఉత్పత్తులకు భారత్‌లో ఎలాంటి ఢోకా లేదని గ్లోబల్ టైమ్స్ మీడియా సంస్థ విశ్లేషించింది. చైనా ఉత్పత్తులను బహిష్కరించాలంటూ భారత్‌లోని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాలు.. రాజకీయంగా ఏమాత్రం ప్రభావం చూపల

Webdunia
శుక్రవారం, 21 అక్టోబరు 2016 (07:26 IST)
చైనా ఉత్పత్తులకు భారత్‌లో ఎలాంటి ఢోకా లేదని గ్లోబల్ టైమ్స్ మీడియా సంస్థ విశ్లేషించింది. చైనా ఉత్పత్తులను బహిష్కరించాలంటూ భారత్‌లోని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాలు.. రాజకీయంగా ఏమాత్రం ప్రభావం చూపలేవంటూ చైనా ప్రభుత్వ ఆధీనంలోని గ్లోబల్ టైమ్స్ మీడియా సంస్థ విశ్లేషించింది.

అణు సరఫరాదారుల బృందం (ఎన్‌ఎస్‌జీ)లో భారత్‌ చేరికతోపాటు మసూద్‌ అజ్‌హర్‌ను ఐరాస ఉగ్రవాదిగా ప్రకటించే విషయంలోనూ చైనా అడ్డుగా నిలుస్తున్న నేపథ్యంలో..భారత్‌లో ఆ దేశ ఉత్పత్తులపై వ్యతిరేక ప్రచారం మొదలైన సంగతి తెలిసిందే.
 
దీంతో భారత్‌లో భారత్‌లో చైనా ఉత్పత్తులను కొనకూడదని పిలుపునిస్తారని.. అయితే వాళ్లనుకున్న లక్ష్యం మాత్రం నెరవేరదని సదరు పత్రిక వెల్లడించింది. ప్రస్తుతం చైనాతో భారత్‌కున్న వ్యాపార బంధాలపైనా ఈ ఉద్యమం ప్రభావం చూపలేదని చెప్పింది. అయితే ఈ అంశాలపై భారత్‌, చైనా చర్చిస్తున్నాయని.. త్వరలోనే పరిష్కారం దొరికే అవకాశముందని పత్రిక అభిప్రాయం వ్యక్తం చేసింది. 
 
ఇదిలా ఉంటే.. పాకిస్థాన్‌లో భారత రేడియో, టీవీ ప్రసారాలపై నిషేధం శుక్రవారం నుంచి అమలు కానుంది. శుక్రవారం మధ్యాహ్నం ప్రసారాలు నిలిపివేయనున్నట్లు పాకిస్థాన్‌ ఎలక్ట్రానిక్‌ మీడియా నియంత్రణ ప్రాధికార సంస్థ (పెమ్రా) ప్రతినిధులు తెలిపారు. భారత్‌, పాక్‌ మధ్య ఉద్రిక్తలు పెరిగిన క్రమంలో ప్రజల కోరిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. అయితే ఈ చర్య పట్ల కేబుల్‌ ఆపరేటర్లు, వినియోగదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 
 
మరోవైపు పాక్‌ తాజా చర్యపై భారత్‌ కూడా స్పందించింది. నిషేధం విధించడం దురదృష్టకరమని.. పాక్‌ ఆత్మవిశ్వాస లోపాన్ని అది తెలియజేస్తుందని భారత విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి వికాస్‌ స్వరూప్‌ అన్నారు. పాక్‌ నటీనటులపై భారత ప్రభుత్వం ఏ నిషేధమూ విధించలేదని స్పష్టం చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Santhanam: డీడీ నెక్ట్స్ లెవల్: రోడ్డున పోయే ప్రతి ఒక్కరికీ సమాధానం చెప్పాల్సిన పనిలేదు..

బద్మాషులు నుండి లోకం మారిందా.. సాంగ్ రిలీజ్

23 లాంటి సినిమా తీయడం ఫిల్మ్ మేకర్ గా వెరీ ఛాలెంజింగ్ : డైరెక్టర్ రాజ్ ఆర్

రెట్రో మిస్ అయినా, మాస్ జాతర వరించింది, కామెడీ కూడా చేయబోతున్నా : నవీన్ చంద్ర

ముగ్గురు కోడళ్ల మరణాల చుట్టూ సాగే అయ్యనా మానే సిరీస్ తెలుగులో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

తర్వాతి కథనం
Show comments