Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్తాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 13మంది దుర్మరణం.. 32మందికి గాయాలు

Webdunia
గురువారం, 20 మే 2021 (11:36 IST)
పాకిస్థాన్‌లోని సుక్కూర్‌ జిల్లా దక్షిణ సింద్‌ ప్రావిన్స్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి బోల్తాపడటంతో ఘటనాస్థలంలోనే 13 మంది దుర్మరణం చెందగా.. 32 మందికిపైగా గాయాలయ్యాయి.
 
బస్సు ముల్తాన్‌ నుంచి కరాచీకి వెళ్తుండగా గురువారం తెల్లవారుజామున ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాద సమయంలో ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉన్నారు.
 
పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. బస్సును క్రేన్‌ సాయంతో పైకి ఎత్తి వాహనంలో చిక్కుకుపోయిన వారిని అతికష్టం మీద బయటకు తీశారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సుక్కూర్‌ సివిల్‌ హాస్పటల్‌, పాలోఅకిల్‌ తాలూక హాస్పటళ్లకు తరలించారు.
 
గాయపడిన వారిలో చాలామంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. గాయపడిన వారిని తరలిస్తున్న నేపథ్యంలో సుక్కూర్‌, రోహిర్‌ దవాఖానల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments