Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రైనీ పైలట్ చేతిలో 305 ప్రయాణికుల ప్రాణాలు... ఫ్లైట్‌లో గుర్రుపెట్టి నిద్రపోయిన పైలట్..

పాకిస్థాన్ పాలకులే కాదు.. ఆ దేశానికి చెందిన విమానయాన సంస్థ పైలట్లు కూడా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతారని మరోమారు నిరూపితమైంది. ఏకంగా 305 మంది ప్రయాణికుల ప్రాణాలను ట్రైనీ పైలట్ చేతిలో పెట్టిన ఓ పైలట్..

Webdunia
సోమవారం, 8 మే 2017 (09:28 IST)
పాకిస్థాన్ పాలకులే కాదు.. ఆ దేశానికి చెందిన విమానయాన సంస్థ పైలట్లు కూడా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతారని మరోమారు నిరూపితమైంది. ఏకంగా 305 మంది ప్రయాణికుల ప్రాణాలను ట్రైనీ పైలట్ చేతిలో పెట్టిన ఓ పైలట్.. క్యాబిన్‌లో గుర్రుపెట్టి నిద్రపోయాడు. అలా ఏకంగా రెండున్నర గంటల పాటు నిద్రపోయాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
గత నెల 26న పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌ నుంచి లండన్‌కు పాక్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌లైన్స్‌(పీఐఏ)కు చెందిన ఓ విమానం ఒకటి బయలుదేరింది. ఈ విమానం టేకాఫ్‌ తీసుకున్న కొద్దిసేపటికే పైలట్‌ కెప్టెన్‌ అమీర్‌ అక్తర్‌ హష్మీ.. తన బాధ్యతలను ట్రైనీ పైలట్‌ మహ్మద్‌ అసద్‌ అలీకి అప్పగించాడు. 
 
ఆ తర్వాత ఆయనగారు బిజినెస్‌ క్లాస్‌లోకి వెళ్లి ఏకంగా రెండున్నర గంటలపాటు నిద్రపోయాడు. ఈ దృశ్యాన్ని ఓ ప్రయాణికుడు వీడియో తీసి సోషల్‌ మీడియాలో పెట్టాడు. ఘటనపై పీఐఏ అధికారులకు ఫిర్యాదు చేశాడు. స్పందించిన అధికారులు సదరు పైలట్‌ను విధుల నుంచి తొలగించారు.

నారా లోకేష్‌ను కలిసిన నటుడు నిఖిల్ సిద్ధార్థ్.. చీరాలలో ర్యాలీ

మాధవీలత స్ట్రాంగ్ ఉమెన్.. ఎలాంటి ప్యాకేజీ తీసుకోలేదు.. రేణు దేశాయ్

బాలక్రిష్ణ 109 వ సినిమా తాజా అప్ డేట్

హీరో అర్జున్ ఆవిషరించిన సహ్య మైథలాజికల్ చిత్ర ఫస్ట్ లుక్

డల్లాస్ లో స్పైసీ టూర్ లో థమన్ ఆ 7వ పాటను రిలీజ్ చేస్తాడా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు పరగడుపున తింటే?

గుండె ధమనుల్లో అడ్డంకులు ఏర్పడకుండా చేసే గింజలు ఇవే

తర్వాతి కథనం
Show comments