చైనా నుంచి 48 వింగ్ లూంగ్ డ్రోన్లను కొనుగోలు పాకిస్థాన్

Webdunia
గురువారం, 21 మార్చి 2019 (10:48 IST)
పుల్వామా ఉగ్ర దాడి, భారతవాయుసేన పాక్ ఉగ్రవాద శిబిరాలపై దాడులు జరిపిన అనంతంరం పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తత మొదలైంది. యుద్ధం వద్దని, శాంతి కోరుతున్నామని పైకి చెబుతున్నా పాక్ దానిని పాటించడం లేదు. పలుమార్లు భారత్‌ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది. యుద్ధ పరిణామాలు దారితీసే విధంగా ప్రవర్తిస్తోంది. సరిహద్దుల్లో సైనికులతో మోర్టార్‌లతో కాల్పులు జరిపించడం వంటివి చేస్తోంది. 
 
ఒప్పందాలన్నింటినీ ఉల్లంఘిస్తోంది. పాకిస్థాన్ సరిహద్దుల్లో ఆయుధాలతో కూడిన డ్రోన్లను రంగంలోకి దించిందని భారత సరిహద్దు భద్రతాదళం తన రహస్య నివేదికలో వెల్లడించింది. పాక్ సరిహద్దుల్లోని ఉరి, పూంచ్, రాజౌరి, నౌషెరా, సుందర్ బనీ సహా 12 ప్రాంతాలలో పాక్ ఆయుధాలతో కూడిన డ్రోన్‌లను రంగంలోకి దించిందని బీఎస్ఎఫ్ పేర్కొంది. 
 
గుజరాత్ రాష్ట్ర సరిహద్దుల్లో ఎగురుతున్న డ్రోన్‌ను ఇటీవల భారత సైన్యం కూల్చివేసింది. పాక్ డ్రోన్‌లతో సరిహద్దుల్లో నిఘా వేయడంతో భారత సైన్యం అప్రమత్తమైంది. పాకిస్థాన్ గత ఏడాది చైనా నుంచి 48 వింగ్ లూంగ్ డ్రోన్లను కొనుగోలు చేసింది. పాక్ మిలిటరీకి తమ వంతు సహాయం చేస్తామని చైనా ఇదివరకే ప్రకటించింది. పాక్ డ్రోన్‌లు ఎగురుతుండటంతో బీఎస్ఎఫ్ దళాలు అప్రమత్తమయ్యాయి. తగిన చర్యలు తీసుకుంటున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గురుదత్త గనిగ, రాజ్ బి. శెట్టి కాంబోలో జుగారి క్రాస్ టైటిల్ ప్రోమో

Shimbu: సామ్రాజ్యం తో శింబు బెస్ట్ గా తెరపైన ఎదగాలి : ఎన్టీఆర్

Ram Charan: పెద్ది తాజా అప్ డేట్.. శ్రీలంక వెళ్లనున్న రామ్‌చరణ్‌

Shivaji : శివాజీ, లయ కాంబినేషన్ లో పంచాయతీ సెక్రెటరీ

Siddu: తెలుసు కదా.. చేసే ముందు భయం ఉండేది, ఈరోజు భయం పోయింది : సిద్ధు జొన్నలగడ్డ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

తర్వాతి కథనం
Show comments