Webdunia - Bharat's app for daily news and videos

Install App

బోట్స్‌వానాలో 350 ఏనుగుల మృతి.. ఇదెలా జరుగుతుంది?

Webdunia
శుక్రవారం, 3 జులై 2020 (22:43 IST)
Botswana
బోట్స్‌వానాలో ఏనుగుల భారీ సంఖ్య మృతి చెందడం ప్రస్తుతం ప్రపంచ దేశాలను కలవరపెడుతుంది. బోట్స్‌వానాలో 1990 చివరలో ఏనుగుల సంఖ్య విపరీతంగా పెరిగింది. అక్కడ ఏనుగుల సంఖ్య 80,000 నుండి 1.30 లక్షల వరకు ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు. వేటపై కఠిన నిషేధం విధించడం కారణంగా ఏనుగుల సంఖ్య పెరుగుతూ వస్తున్నది. 
 
ఇలాంటి పరిస్థితుల్లో బోట్స్‌వానాలో ఇప్పటివరకు 350 ఏనుగులు మృత్యువాతపడ్డాయి. ఆఫ్రికాలో క్షీణిస్తున్న ఏనుగుల జనాభాలో మూడింట ఒక వంతు బోట్స్‌వానాలో ఉన్నాయి. బోట్స్‌వానాలోని వాయువ్య భాగంలో భారీ ఎత్తున ఏనుగులు మృతి చెందడంపై మిస్టరీ ఇంకా వీడలేదు. ఏనుగులు ఎలా చనిపోతున్నాయనేది పరిశోధకులకు, శాస్త్రవేత్తలకు అంతు చిక్కని ప్రశ్నగా మిగిలిపోయింది. 
 
ఆ ఏనుగులను వేటాడి చంపిన ఆనవాళ్లుగానీ, వాటి మృతదేహాలపై ఎలాంటి గాయాల గుర్తులు గానీ లేవు. మానవులే విషాన్నిచ్చి చంపారనే వాదనను కూడా తోసిపుచ్చుతున్నారు. బోట్స్‌వానాలోని ప్రాంతంలో వన్యప్రాణులను చంపడానికి ఎక్కువగా ఆంత్రాక్స్ అనే విషాన్ని ఉపయోగిస్తుంటారు. ఏనుగుల మరణానికి ఖచ్చితమైన కారణాలు తెలుసుకొనే అన్వేషణలో ఉన్నామని బోట్స్‌వానా ప్రాంతీయ వన్యప్రాణి సమన్వయకర్త డిమాకాట్సో నాట్షెబే చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చాలా కాలంగా మిస్ అయ్యాను, తండేల్ తో మళ్ళీ నాకు తిరిగివచ్చింది : అక్కినేని నాగచైతన్య

చిరంజీవి పేరు చెప్పడానికి కూడా ఇష్టపడని అల్లు అరవింద్

మాస్ ఎంటర్‌టైనర్‌ గా సందీప్ కిషన్ మజాకా డేట్ ఫిక్స్

బొమ్మరిల్లు బాస్కర్, సిద్ధు జొన్నలగడ్డ కాంబోలో వినోదాత్మకంగా జాక్ టీజర్

తెలంగాణ దర్శకుడు తనయుడు దినేష్‌మహీంద్ర దర్శకత్వంలో లవ్‌స్టోరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Rose Day 2025 : రోజ్ డే 2025- ఏ రంగులో గులాబీ పువ్వు? వాడిపోయిన పువ్వులు?

రోజుకి గ్లాసు పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments