Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చైనాలో వైన్ తాగి తేయాకు తోటలో తూగిన ఏనుగులు.. ఫోటోలు వైరల్

Advertiesment
చైనాలో వైన్ తాగి తేయాకు తోటలో తూగిన ఏనుగులు.. ఫోటోలు వైరల్
, శనివారం, 21 మార్చి 2020 (18:27 IST)
Elephants
ఏనుగులు వైన్ తాగి తోటలో తూలిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చైనాలోని యునాన్ ప్రావిన్స్‌ అటవీ ప్రాంతం నుంచి బయటికి వచ్చి 14 ఏనుగులు అక్కడున్న తేయాకు తోటలోకి ప్రవేశించాయి. పరిసరాల్లో ఇళ్లను ధ్వంసం చేశాయి. 
 
ఇలా ఓ ఇంట్లో వుంచిన 30 లీటర్ల వైన్‌ను రెండు ఏనుగులు ఫూటుగా తాగాయి. అంతే మత్తులో తూగిన ఏనుగులు తేయాకు తోటలో తిరుగుతూ.. ఒక దశలో తోటలోనే నిద్రపోయాయి. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా ఎఫెక్ట్.. రేపు రైల్వేకు బ్రేక్