Webdunia - Bharat's app for daily news and videos

Install App

నర్సు కాదు కిరాతకురాలు.. నవజాత శిశువులు ఎనిమిది మందిని..?

Webdunia
గురువారం, 12 నవంబరు 2020 (11:26 IST)
దేశంలో కాదు.. ప్రపంచ దేశాల్లోనూ నేరాల సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా అభంశుభం తెలియని నవజాత శిశువులను ఓ నర్సు పొట్టనబెట్టుకుంది. పురుడు పోయాల్సిన నర్సు.. అప్పుడే పుట్టిన చిన్నారులను చిదిమేసింది. ఆమె పనిచేస్తున్న దవాఖానలోనే ఇప్పటివరకు ఎనిమిదిమంది నవజాత శిశువులను చంపింది. మరో పది మంది చిన్నారుల ప్రాణాలను తీయడానికి ప్రయత్నించింది. ఆఖరుకు పోలీసులకు దొరికిపోయి ఊచలు లెక్కబెడుతోంది.
 
వివరాల్లోకి వెళితే.. ఇంగ్లండ్‌లోని నార్త్‌వెస్టర్న్ ఇంగ్లిష్ సిటీలో ఉన్న ఓ స్థానిక దవాఖానలో లూసీ లెట్ బే అనే నర్సు పనిచేస్తుంది. దవాఖానలో అప్పుడే పుట్టిన చిన్నారులను చంపేస్తున్నదనే అభియోగాలపై పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. 
 
2015, జూన్ నుంచి 2016 జూన్ వరకు కౌంటెస్ ఆఫ్‌ చెస్టర్ దవాఖానలోని నియోనటల్ యూనిట్‌లో ఎనిమిది మంది చిన్నారులను చంపేసిందని, మరో పది మంది శిశువులపై హత్యాయత్నం చేసిందని తెలిపారు. ఆమెను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరుచనున్నారు. గతంలో 2018, 2019లోకూడా ఇవే ఆరోపణలపై ఆ నర్సును పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఆరోపణలు రుజువుకాకపోవడంతో ఆమెను విడుదల చేయడం గమనార్హం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కళ్యాణి ప్రియదర్శన్‌ ను కొత్తగా ఆవిష్కరించిన కోత లోకహ్ 1: చంద్ర ట్రైలర్

Sreeleela: జూనియర్ ఎన్టీఆర్‌ను చూసి ముచ్చటపడిన శ్రీలీల తల్లి స్వర్ణలత

Amani: ఒగ్గు కళాకారుల నేపథ్యం లో తెరకెక్కిన బ్రహ్మాండ చిత్రం

బార్బరిక్ షూటింగ్‌లో ప్రతీ రోజూ ఛాలెంజింగ్‌గా అనిపించేది : వశిష్ట ఎన్ సింహా

హర హర శంకర పాటలో సమాజంలో ఘోరాల్ని చూపించారు : తనికెళ్ళ భరణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments