Webdunia - Bharat's app for daily news and videos

Install App

నైట్ క్లబ్‌లో అగ్నిప్రమాదం... 59 మంది సజీవ దహనం!!

ఠాగూర్
సోమవారం, 17 మార్చి 2025 (09:10 IST)
యూరప్ దేశంలోని నార్త్ మెసిడోనియాలో ఓ విషాదకర ఘటన చోటుచేసుకుంది. నైట్ క్లబ్‌లో సంగీత కార్యక్రమం జరుగుతున్న సమయంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 59 మంది సజీవదహనమయ్యారు. మరో 155 మంది తీవ్రంగా గాయపడ్డారు. కొకాని పట్టణంలోని పల్స్ నైట్ క్లబ్‌లో స్థానిక పాప్ బృందం కన్సర్ట్ నిర్వహిస్తుండగా సోమవారం తెల్లవారుజామున 2.35 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. 
 
ఈ కార్యక్రమంలో బాణాసంచా కాల్చడంతో పైకప్పునకు మంటలు అంటుకున్నాయి. దీన్ని గమనించిన పాప్ బృందం వెంటనే అక్కడ నుంచి అందరూ వెళ్లిపోవాలని కోరింది. దీంతో ఏం జరిగిందో అర్ధంకాక గందరగోళం మధ్యే యువతీయువకులు ప్రాణభయంతో పరుగులు తీశారు. ఈ లోపే దట్టమైన పొగ కమ్మేయడంతో ఊపిరాడని పరిస్థితి నెలకొంది. ఈ కార్యక్రమంలో దాదాపు 1500 మంది పాల్గొన్నారు. వీరిలో ఎక్కువ మంది యువతీ యువకులే. మరణించిన వారిలో ఇప్పటివరకు 39 మందిని గుర్తించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. 
 
ఈ ఘటనపై మెసిడోనియా ప్రధానమంత్రి హ్రిస్టిజన్ మికోస్కీ ఎక్స్ వేదికగా విచారం వ్యక్తం చేశారు. ఇది మెసిడోనియాకు విచారకరమని, చాలా మంది యువతీ యువకులు మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన దేశానికి పూడ్చలేని నష్టంగా ఆయన అభివర్ణించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments