దక్షిణ కొరియా నుంచి ఉత్తర కొరియాకు కరోనా.. కిమ్ సీరియస్..

Webdunia
ఆదివారం, 26 జులై 2020 (11:30 IST)
ఉత్తర కొరియాలో కరోనా వైరస్ నమోదు కావడం మొదలైంది. దీంతో ఉత్తర కొరియా అప్రమత్తత చర్యలు చేపట్టింది. దక్షిణ కొరియా నుంచి వచ్చిన వ్యక్తి వల్లే దేశంలోకి ఈ వైరస్‌ చొరబడినట్లు అక్కడి ప్రభుత్వ న్యూస్‌ ఏజెన్సీ తెలిపింది. మూడేళ్ల క్రితం దక్షిణ కొరియాకు పారిపోయిన వ్యక్తి ఇటీవల దేశానికి తిరిగి వచ్చాడని.. అతనిలో వైరస్‌ లక్షణాలు ఉన్నట్లు పేర్కొంది.
 
దీంతో దేశాధినేత కిమ్‌జోంగ్‌ ఉన్‌ అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. అనంతరం సరిహద్దుల్లోని కైసాంగ్‌ నగరంలో లాక్‌డౌన్‌ విధించారు. ''సరిహద్దుల్లోని కైసాంగ్‌ నగరంలో అనుకోని ఘటన జరిగింది. మూడేళ్ల క్రితం దేశం నుంచి దక్షిణ కొరియాకు పారిపోయిన వ్యక్తి జులై 19 తిరిగి వచ్చాడు. అతనిలో కరోనా వైరస్‌ లక్షణాలు ఉన్నాయి. అతను అక్రమంగా దేశ సరిహద్దులు దాటాడు'' అని కేసీఎన్‌ఏ పేర్కొంది.
 
ఇటీవలే వైరస్‌పై విజయం సాధించామని ప్రకటించిన కిమ్‌ జోంగ్‌ ఉన్‌కు తాజా ఘటన ఆగ్రహం తెప్పించింది. వీలైనన్ని అత్యవసర చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అసలు ఆ వ్యక్తి సరిహద్దులు ఎలా దాటాడో కనుగొనాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనకు కారకులపై కారకులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం