Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు.. ఒకే రోజు 705మంది మృతి

Webdunia
ఆదివారం, 26 జులై 2020 (10:55 IST)
దేశంలో కరోనా విజృంభిస్తోంది. గత నాలుగు రోజులు వరుసగా కరోనా కేసులు 50వేలకు చేరువలో కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 48,661 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 13,85,522కి చేరింది. ఇందులో 4,67,882 కేసులు యాక్టివ్ గా ఉంటె, 8,85,577 మంది డిశ్చార్జ్ అయ్యారు. 
 
గడిచిన 24 గంటల్లో భారత్‌లో 705 కరోనా మరణాలు సంభవించాయి. దీంతో భారత్‌లో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 32,063కి చేరింది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 4,42,263 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. దీంతో భారత్‌లో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 1,62,91,331కి చేరింది.
 
జులై 23 నుంచి దేశవ్యాప్తంగా ప్రతిరోజూ 40,000కిపైగా పాజిటివ్‌ కేసులు వెలుగుచూస్తుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. మహారాష్ట్రలో అత్యధికంగా 1,40,000కిపైగా కరోనా కేసులతో పాటు 13,312 మరణాలు చోటుచేసుకున్నాయి.
 
కోవిడ్‌-19 కేసులు పెరగడంతో పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ నిబంధనలను కఠినతరం చేస్తుండగా, మరికొన్ని రాష్ట్రాల్లో ప్రధాన నగరాలు, కంటైన్మెంట్‌ జోన్లలో సంపూర్ణ లాక్‌డౌన్‌ను పాటిస్తున్నారు. అయితే యాక్టివ్‌ కేసుల కంటే కోలుకున్న రోగుల సంఖ్య రెట్టింపవడం ఊరట కలిగిస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Love in Dubai: రాజ్ నిడిమోరుతో దుబాయ్‌కి వెళ్లిన సమంత.. రీల్ వైరల్ అయ్యిందిగా (video)

Prabhas: ఘాటీ రిలీజ్ గ్లింప్స్‌ విడుదలచేస్తూ, ట్రైలర్ ఆకట్టుకుందంటూ ప్రభాస్ ప్రశంసలు

Manoj: తమిళ్ ఆఫర్లు వస్తున్నాయి, అన్ని భాషల్లో సినిమాలు చేయాలి : మనోజ్ మంచు

ఖైరతాబాద్ గణేషుని సమక్షంలో తల్లాడ కె.పి.హెచ్.బి. కాలనీలో చిత్రం

Lavanya Tripathi : టన్నెల్ ట్రైలర్ లో లావణ్య త్రిపాఠి, అధర్వ మురళీ కాంబో అదిరింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

జాతీయ పోషకాహార మాసం: మీ రోజువారీ పోషణను బాదం ఎలా మెరుగుపరుస్తుంది?

Lotus Root: తామర పువ్వు వేర్లను సూప్స్‌, సలాడ్స్‌లో ఉపయోగిస్తే?

తర్వాతి కథనం
Show comments