Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్యంత విషమంగా నిత్యానంద ఆరోగ్యం : శ్రీలంక వర్గాలు

Webdunia
మంగళవారం, 6 సెప్టెంబరు 2022 (16:14 IST)
వివాదాస్పద, ఆధ్యాత్మిక గురువు నిత్యానంద స్వామి ఆరోగ్యం మరింత విషమంగా ఉందని శ్రీలంక ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఆయన అంతుచిక్కని వ్యాధితో బాధపడుతున్నారని పేర్కొన్నాయి. అందువల్ల ఆయనకు అత్యవసరంగా చికిత్స చేయాలని తెలిపింది. ప్రస్తుతం నిత్యానంద పరిస్థితి అత్యంత విషమంగా ఉందని ఆ వర్గాలు వెల్లడించాయి. 
 
గత 2010లో అత్యాచారం కేసులో అరెస్టు అయిన నిత్యానంద స్వామి ఆ తర్వాత బెయిలుపై విడుదలయ్యారు. అయితే, కేసు విచారణకు హాజరుకాకపోవడంతో ఆయనకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. దీంతో ఆయన దేశం విడిచి పారిపోయాడు. 
 
ఈ క్రమంలో ఈక్వెడార్ దేశంలోని ఓ చిన్న దీవిని కొనుగోలు చేసి దానికి కైలాస దేశం అనే పేరు పెట్టారు. ఈ దేశానికి అధ్యక్షుడు తానేనని, తన దేశానికి ఎవరైనా రావొచ్చని ప్రకటించారు. పైకా, కైలాస్ దేశానికి కొత్త కరెన్సీ కూడా ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments