Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిమిష ఉరిశిక్షను తాత్కాలికంగా నిలిపివేసిన యెమెన్

ఠాగూర్
మంగళవారం, 15 జులై 2025 (15:20 IST)
భారతీయ మహిళ నిమిష ప్రియ మరణశిక్షను యెమెన్ అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. తనను నిరంతరం వేధిస్తూ వచ్చిన వ్యక్తిని హత్య చేసినందుకుగాను కేరళకు చెందిన ఈ నర్సుకు యెమెన్ కోర్టు ఉరిశిక్షను ఖరారు చేసింది. ఈ శిక్షను బుధవారం అమలు చేయాల్సివుంది. అయితే, యెమెన్ అధికారులు మాత్రం ఈ శిక్షను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ శిక్షను అమలు చేయాల్సివుండగా, భారత అధికారులు యెమెన్ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆమె మరణశిక్ష అమలును తాత్కాలికంగా యెమెన్ అధికారులు వాయిదా వేశారని భారత విదేశాంగ వర్గాలు వెల్లడించాయి. 
 
నిమిష ఉరిశిక్షను ఆపడానికి కేంద్ర ప్రభుత్వం తన పరిధిలో అని రకాలైన సంప్రదింపులు జరుపుతోంది. ఈ విషయలో కేంద్ర ప్రభుత్వం నిమిష కుటుంబానికి అవసరమైన సహాయాన్ని అందిస్తుంది. మృతుడి కుటుంబంతో నిమిష ప్రియ కుటుంబం చర్చల కోసం మరింత గడువు కోవాలని భారత్ బలంగా కోరింది. అందుకే చివరి నిమిషంలో ఈ శిక్షను యెమెన్ అధికారులు నిలిపివేశారు. 
 
కాగా, ఈ కేసు మొదలైనప్పటి నుంచి నిమిష ప్రియకు అన్ని విధాలా సాయం చేసేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నిస్తూనే ఉందని భారత విదేశాంగ శాఖ వర్గాలు వెల్లడించాయి. నిమిష కుటుంబం, భారత కుటుంబం పరస్పర అంగీకారానికి వచ్చి కేసును పరిష్కరించుకునేలా కొంత సమయం ఇచ్చేందుకు ప్రయత్నాలు చేసినట్టు విదేశాంగ శాఖ వెల్లడించింది. స్థానిక జైలు అధికారులు, ప్రాసిక్యూటర్ కార్యాలయంతో నిరంతరం సంప్రదింపులు జరిపినట్టు తెలిపింది. ఈ క్రమంలోనే మరణశిక్ష వాయిదా పడినట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mrunal Thakur: ఆన్‌లైన్‌లో ట్రెండ్ అవుతున్న మృణాల్ ఠాకూర్ పేరు.. ఎలాగంటే?

పగ, అసూయ, ప్రేమ కోణాలను చూపించే ప్రభుత్వం సారాయి దుకాణం

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు 9 కొత్త సీజన్ : కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. ఏంటవి?

Pawan: ఎన్టీఆర్, ఎంజీఆర్ ప్రేరణతో పవన్ కళ్యాణ్ పాత్రను రూపొందించా: జ్యోతి కృష్ణ

సయారా తో ఆడియెన్స్ ఆషికి రోజుల్ని తలుచుకుంటున్నారు : మహేష్ భట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments