Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోదీ ఆహ్వానం మేరకు.. భారత్‌కు శ్రీలంక అధ్యక్షుడు

Webdunia
గురువారం, 28 నవంబరు 2019 (14:02 IST)
రెండు రోజుల పర్యటనలో భాగంగా నేడు భారత్​కు రానున్నారు శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు భారత్​లో పర్యటించనున్నారు. 
 
శుక్రవారం రాష్ట్రపతి భవన్​లో రాజపక్స గౌరవార్థం సత్కార కార్యక్రమం నిర్వహించనున్నారు. అదే రోజున మోదీ, రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​తో భేటీ కానున్నట్లు విదేశాంగ మంత్రి జయ్​శంకర్​ వెల్లడించారు.
 
మోదీతో కలిసి ఇరు దేశాల మధ్య అభివృద్ధి, శాంతి, భద్రత వంటి అంశాలు మరింత బలోపేతం చేసే దిశగా చర్చలు జరగనున్నాయి. లంక ఎన్నికల ఫలితాల అనంతరం ఆదివారం నాడు ప్రధాని మోదీ స్వయంగా రాజపక్సకు ఫోన్​ ద్వారా భారత ప్రజలందరి తరపున శుభాకాంక్షలు తెలిపారు. 
 
రాజపక్స నాయకత్వంలో లంకలో శాంతి భద్రతలు మెరుగుపడాలని ఆకాంక్షించారు మోదీ. రాజపక్స నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఇదే ఆయనకు తొలి అధికారిక విదేశీ పర్యటన.

సంబంధిత వార్తలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments