Webdunia - Bharat's app for daily news and videos

Install App

15 నిమిషాల పాటు దర్చులా వంతెనను తెరిచారు.. 12 నిమిషాల్లో పెళ్లి తంతు పూర్తి

Webdunia
బుధవారం, 15 జులై 2020 (13:53 IST)
wedding
కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో వివాహాలు ఏదో మొక్కుబడిగా జరిగిపోతున్నాయి. ముందులా వివాహాలకు జనాలు రారు. పెళ్లి వేడుకలు ప్రస్తుతం 30 మందితో జరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇండో-నేపాల్ సరిహద్దు వద్ద ఆసక్తికరమైన విషయం చోటుచేసుకుంది. ఇండో-నేపాల్ పరిపాలనా యంత్రాంగాలు 15 నిమిషాల పాటు అంతర్జాతీయ వంతెనను ఓ జంట వివాహంతో ఒక్కటయ్యేందుకు తెరిచాయి. 
 
పెళ్లి ఊరేగింపు లేకుండానే వరుడు తన తండ్రితో కలిసి నేపాల్‌లోని దర్చులాలో జరిగే తమ వివాహ వేడుకకు హాజరయ్యాడు. వీరి వివాహం కేవలం 12 నిమిషాల్లో ముగిసింది. కరోనా ఆంక్షల నేపథ్యంలో.. నేపాల్ పరిపాలనా విభాగం అనుమతితో భారత్‌లోని పిథోరాగఢ్‌కు చెందిన కమలేష్ చంద్ తన వివాహం కోసం నేపాల్‌లోని దర్చులాకు చేరుకున్నాడు. 
 
పెళ్లికి వరుడు, అతని తండ్రి మాత్రమే హాజరయ్యారు. ప్రభుత్వ అనుమతి మేరకు 15 నిముషాల పాటు ఝూలాపూల్ తెరిచారు. దర్చులాలో వరుడు, వధువు దండలు మార్చుకున్నారు. వెంటనే ఆ కొత్త దంపతులు భారత్‌కు తిరిగి వచ్చారు. కాగా మార్చి 22న వీరి వివాహం జరగాల్సివుంది. అయితే లాక్‌డౌన్ కారణంగా పెళ్లి వాయిదా పడింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sharwanand: తమన్నా ని హీరోయిన్ అని పిలవడం ఇష్టం లేదు : శర్వానంద్

Maheshbabu: వెకేషన్ నుంచి తిరిగి హైదరాబాద్ వచ్చిన మహేష్ బాబు

ఎంతో మందితో కలిసి పని చేసినా.. కొంతమందితోనే ప్రత్యేక అనుబంధం : తమన్నా

Nani: వైలెన్స్ సినిమాలున్న దేశాల్లో క్రైమ్ రేట్ తక్కువ, కానీ ఇక్కడ మన బుద్ధి సరిగ్గా లేదు : నాని

Dhanush: శేఖర్ కమ్ముల కుబేర లో ధనుష్ మాస్ సాంగ్ డేట్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

తర్వాతి కథనం
Show comments