Webdunia - Bharat's app for daily news and videos

Install App

15 నిమిషాల పాటు దర్చులా వంతెనను తెరిచారు.. 12 నిమిషాల్లో పెళ్లి తంతు పూర్తి

Webdunia
బుధవారం, 15 జులై 2020 (13:53 IST)
wedding
కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో వివాహాలు ఏదో మొక్కుబడిగా జరిగిపోతున్నాయి. ముందులా వివాహాలకు జనాలు రారు. పెళ్లి వేడుకలు ప్రస్తుతం 30 మందితో జరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇండో-నేపాల్ సరిహద్దు వద్ద ఆసక్తికరమైన విషయం చోటుచేసుకుంది. ఇండో-నేపాల్ పరిపాలనా యంత్రాంగాలు 15 నిమిషాల పాటు అంతర్జాతీయ వంతెనను ఓ జంట వివాహంతో ఒక్కటయ్యేందుకు తెరిచాయి. 
 
పెళ్లి ఊరేగింపు లేకుండానే వరుడు తన తండ్రితో కలిసి నేపాల్‌లోని దర్చులాలో జరిగే తమ వివాహ వేడుకకు హాజరయ్యాడు. వీరి వివాహం కేవలం 12 నిమిషాల్లో ముగిసింది. కరోనా ఆంక్షల నేపథ్యంలో.. నేపాల్ పరిపాలనా విభాగం అనుమతితో భారత్‌లోని పిథోరాగఢ్‌కు చెందిన కమలేష్ చంద్ తన వివాహం కోసం నేపాల్‌లోని దర్చులాకు చేరుకున్నాడు. 
 
పెళ్లికి వరుడు, అతని తండ్రి మాత్రమే హాజరయ్యారు. ప్రభుత్వ అనుమతి మేరకు 15 నిముషాల పాటు ఝూలాపూల్ తెరిచారు. దర్చులాలో వరుడు, వధువు దండలు మార్చుకున్నారు. వెంటనే ఆ కొత్త దంపతులు భారత్‌కు తిరిగి వచ్చారు. కాగా మార్చి 22న వీరి వివాహం జరగాల్సివుంది. అయితే లాక్‌డౌన్ కారణంగా పెళ్లి వాయిదా పడింది.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments