Publish Date: Tue, 14 Jul 2020 (19:21 IST)
Updated Date: Tue, 14 Jul 2020 (19:23 IST)
ఏపీలో 20 కేసులు అధిగమించిన ప్రాంతాలకు స్థానిక లాక్ డౌన్ ఆంక్షలు విధించింది ఏపీ ప్రభుత్వం. ఇందులో భాగంగా తిరుపతి, పుత్తూరు, శ్రీకాలహస్తి, చిత్తూరు, తిరుపతి రూరల్, నగరి, సత్యవేడు, రేణిగుంట, మదనపల్లె, నిండ్ర, నారాయణవనం, నాగలాపురం, పిచ్చాటూరు, చంద్రగిరి, విజయపురం, ఏర్పేడు, కేవీబీపురం, వరదయ్యపాళెం, వికోట, గుడిపాల, కార్వేటి నగరం, పుంగనూరు ప్రాంతాలలో సుమారు 20 కరోనా కేసులు ఉన్నాయి.
ఇందులో తిరుపతి, నగరి, పుత్తూరు, శ్రీకాళహస్తి, చిత్తూరు కేసుల సంఖ్య మరీ అధికంగా ఉన్నాయి. ఈ ప్రాంతంలో లోకల్ లాక్ డౌన్ ప్రకటించనున్నట్లు కలెక్టర్ వివరించారు.