Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేపాల్ ప్రధానికి చెంపపెట్టు .. కొత్త మ్యాప్‌ ఆమోదానికి పార్లమెంట్ తిరస్కృతి

Webdunia
బుధవారం, 27 మే 2020 (22:59 IST)
నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భారత్‌లోని పలు ప్రాంతాలను కలిపి నేపాల్ కొత్త మ్యాచ్‌ను రూపొందించారు. దీనికి ఆ దేశ పార్లమెంట్ ఆమోదముద్ర వేయలేదు. దీంతో కేపీ శర్మ ఓలీకి ఓ అవమానంగా మారింది. 
 
భారత్‌లోని లిపులేఖ్, కాలాపానీ, లిపియాధురా ప్రాతాంలను తమ భూభాగాలుగా చూపిస్తూ నేపాల్ ఇటీవల ఓ మ్యాప్‌ను రిలీజ్ చేసింది. దీనిపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. అయితే ఈ కొత్త మ్యాప్‌కు బ్రేక్ పడింది. ఈ మ్యాప్‌కు సంబంధించి పార్లమెంటు ఆమోదముద్ర వేయించడంపై నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ ఘోరంగా విఫలమయ్యారు.
 
నేపాల్ కొత్తగా రూపొందించన మ్యాప్‌కు నేపాల్ కేబినెట్ ఆమోదముద్ర వేసినప్పటికీ.. దీనికి రాజ్యాంగ సవరణ తప్పకుండా కావాల్సివుంది. దీంతో రాజ్యాంగ సవరణ కోసం పార్లమెంటులో బుధవారం చర్చ జరిగింది. 
 
కానీ, మెజారిటీ సభ్యుల మద్దతును పొందడంలో కేపీ శర్మ ఓలీ విఫలమయ్యారు. వివిధ పార్టీల ఏకాభిప్రాయ సాధనలో ఆయన సఫలీకృతం కాలేకపోయారు. దీంతో కొత్త మ్యాప్ కోసం చేసిన ప్రయత్నాలు ఇప్పటికైతే వాయిదా పడినట్టైంది. 

సంబంధిత వార్తలు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments