Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐఎన్ఎస్ విక్రాంత్‌పై దాడి చేశాం... భారత్‌ను భయపెట్టాం : పాక్ ప్రధాని గొప్పలు

ఠాగూర్
మంగళవారం, 20 మే 2025 (17:18 IST)
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్‌ చేపట్టింది. ఇందులో పాకిస్థాన్‌పై భారత్ సైనికులు భీకర దాడులు చేశారు. దీంతో పాకిస్థాన్ బెంబేలెత్తిపోయి కాళ్లబేరానికి వచ్చింది. అయితే, పాకిస్థాన్ మాత్రం తన వంకర బుద్ధిని మార్చుకోలేదు. అబద్దాలు చెపుతూ దేశ ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తోంది. 
 
తాజాగా ఆ దేశ ప్రధాని షెహ్‌బాజ్ షరీఫ్ మరోమారు దేశ ప్రజలను తప్పుదారి పట్టించేలా అసత్య ప్రచారం చేశారు. భారత్‌పై విజయం సాధించామంటూ సంబరాలు జరుపుకోగా, ఇపుడు భారత్ యుద్ధ నౌక ఐఎన్ఎస్ విక్రాంత్‌పై దాడి చేసినట్టు వెల్లడించారు దీంతో భారత్ తోకముడిచి వెనక్కి తగ్గిందంటూ వ్యాఖ్యానించారు. పైగా, పాక్ వైమానికదళం జరిపిన దాడిలో ఐఎన్ఎస్ విక్రాంత్ ధ్వంసమైందన్నారు. ఈ వ్యాఖ్యలు ఇపుడు వివాదాస్పదంతో పాటు వైరల్ అయ్యాయి. 
 
కరాచీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న షెహ్‌బాజ్‌ షరీఫ్.. పాక్ నావికాదళం, వైమానికదళాలను ప్రశంసిస్తూ గొప్పలు చెప్పుకున్నారు. భారత నౌకాదళానికి చెందిన ఐఎన్ఎస్ విక్రాంత్ పాకిస్థాన్ సరిహద్దులకు సమీపంగా కేవలం 400 నాటికన్ మైళ్ల దూరంలోకి వచ్చిదంని, అయితే, మన వైమానికధళం విక్రాంత్‌పై దాడి చేసి తీవ్ర నష్టం చేకూర్చిందని అన్నారు. మన దెబ్బకు ఐఎన్ఎస్ విక్రాంత్ తోకముడిచి పారిపోయిందని షెహ్‌బాజ్ షరీఫ్ పచ్చి అబద్ధాలు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం