Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగోలో అంతుచిక్కని వ్యాధి.. 143 మంది మృతి.. పిల్లలే అధిక బాధితులా?

ఠాగూర్
మంగళవారం, 10 డిశెంబరు 2024 (16:44 IST)
ఆఫ్రికా దేశాల్లో ఒకటైన కాంగోలో అంతు చిక్కని వ్యాధి ప్రజలను వణికిస్తుంది. ఈ వ్యాధి సోకి ఇప్పటికే 143 మంది మృతి చెందారు. పైగా, ఈ వ్యాధి చిన్నారులకు అధికంగా సోకుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటివరకు చనిపోయినవారిలో ఐదేళ్ల లోపు చిన్నారుల సంఖ్యే అధికంగా ఉంది. వ్యాధి ఎందుకు, ఎలా సోకుతుందనే వివరాలను వైద్యుల కూడా తెలియడం లేదు. ఈ మిస్టరీ వ్యాధిని వారు డీసీజ్ ఎక్స్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం కాంగోలోని క్వాంగో ప్రావిన్స్‌లో డిసీజ్ ఎక్స్ కేసులో 406 నమోదయ్యాయని అధికారులు తెలిపారు.
 
ఈ అంతు చిక్కని వ్యాధితో ఆస్పత్రితో చేరకుండానే మరికొందరు చనిపోయి ఉండొచ్చని అధికారులు అభిప్రాయపడుతున్నారు. కాంగోలో పేదరికం కారణంగా పిల్లల్లో పౌష్టికాహార లోపం సర్వసాధారణమని గుర్తుచేశారు. ఈ కారణంగానే డిసీస్ ఎక్స్ ఎక్కడ మొదలైంది, ఎలా వ్యాపిస్తుందనే వివరాలు గుర్తించడం సమస్యగా మారిందని ప్రపంచ ఆరోగ్యం సంస్థ నిపుణులు వివరించారు. 
 
ఈ వ్యాధిపై పరిశోధన కోసం నిపుణుల బృందాలను కాంగోకు పంపించామని, వ్యాధి ప్రబలుతున్న ప్రాంతాల్లో రోగుల నుంచి నమూనాలను సేకరించి విశ్లేషిస్తున్నామని ఆరోగ్య సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. వ్యాధి మూలాలను, కారకాలను గుర్తించి అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తున్నట్టు తెలిపింది. 
 
ఈ వ్యాధి సోకినవారు జ్వరం, ఒళ్లు నొప్పు, తలనొప్పి, దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తాయి. అలాగే, జలుబుతో ముక్కు కారడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, రక్తహీనత వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పారితోషికం కంటే పనిలో సంతృప్తి కి ప్రాధాన్యత: కిషోర్ బొయిదాపు

Nitin: సోదరి సెంటిమెంట్ తమ్ముడు మూవీకి ఎ సర్టిఫికెట్ కావాలన్న దిల్ రాజు

అప్పుడు బొమ్మరిల్లు ఇప్పుడు 3 BHK, అందుకే కె విశ్వనాథ్ గారికి అంకితం: సిద్ధార్థ్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

'కాంటా లగా' ఫేమ్ షఫాలీ జరివాలా హఠాన్మరణం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments